పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల మార్చి 28 అని టీమ్ పదే పదే పలు మార్గాల్లో నొక్కి వక్కాణిస్తోంది కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఇప్పటికీ ఆ డేట్ పట్ల అనుమానంగానే ఉన్నాయి. ఇంకొద్ది రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడంతో ఫ్యాన్స్ లోనూ సందేహాలు లేకపోలేదు.
ఒకవేళ నిజంగా వీరమల్లు కనక మాట మీద నిలబడితే ఎవరికి లాభం ఎవరికి కష్టమో చూద్దాం. ముందుగా బెనిఫిట్ అయ్యేది నిర్మాత ఏఎం రత్నమే. ఎందుకంటే డిప్యూటీ సిఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమాగా ఫ్యాన్స్ ఇచ్చే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.
టాక్ కనక పాజిటివ్ వచ్చిందా వసూళ్ల సునామి ఖాయం. ఇదింకా పార్ట్ 1 కాబట్టి కంటెంట్ కనక బాగుంటే రెండో భాగానికి సరిపడా బిజినెస్ డిమాండ్ ఇప్పుడే ఏర్పడుతుంది. ఇది వర్కౌట్ కావాలంటే బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ రావాలి. తర్వాత ఏప్రిల్ లో ప్లాన్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ఒక పోటీ తగ్గింది కనక రిలాక్స్ అవుతాయి.
ఇక కష్టం విషయానికి వస్తే అదే డేట్ కి లాక్ చేసుకున్న నితిన్ రాబిన్ హుడ్ ఇంకో ప్రత్యాన్మయం చూసుకోవాలి. మరుసటి రోజు షెడ్యూల్ చేసిన మ్యాడ్ స్క్వేర్ కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. నిర్మాత నాగవంశీ నేరుగా పవన్ కళ్యాణ్ తో క్లాష్ కి ఎట్టి పరిస్థితుల్లో సిద్దపడడు.
ఇక డబ్బింగ్ సినిమాలైన మోహన్ లాల్ ఎల్ 2 ఎంపురాన్, విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2 తెలుగు వెర్షన్లకు థియేటర్ల సమస్య వస్తుంది. ఆ రెండు టాలీవుడ్ మార్కెట్ మీద బోలెడు నమ్మకంతో మంచి రేట్లకు సినిమాలు అమ్ముకునే ప్లాన్ లో ఉన్నాయి. హరిహర వీరమల్లు కనక బరిలో ఉంటే దానికి ఎదురుగా నిలవడం అంత సులభం కాదు.
ఇవి కాకుండా సల్మాన్ ఖాన్ సికందర్ కూడా అదే వారం వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వీరమల్లుకి రివర్స్ లో హిందీ సైడ్ ఇబ్బందులుంటాయి. ఇలా ఒక తేదీ వెనుక ఇన్ని రకాల విశ్లేషణలు, లెక్కలు ఉన్నాయి. వీలైనంత త్వరగా టీమ్ మరోసారి అధికారిక ప్రకటన ఇస్తే బెటర్.
This post was last modified on February 4, 2025 10:12 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…