Movie News

గీత ఆర్ట్స్ నుండి బయటకి? : వాసు ఏమన్నారంటే…

టాలీవుడ్లో గొప్ప చరిత్ర ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. ఆ సంస్థను నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు అల్లు అరవింద్. ఐతే తన నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కొడుకుల్లో ఒకరి చేతుల్లో పెడతారని అందరూ అనుకుంటే.. ఆయన మాత్రం బన్నీ వాసు అనే బయటి వ్యక్తిని ఎంతగానో నమ్మారు. అతనే చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ వ్యవహారాలను చూస్తున్నాడు.

అరవింద్ పెద్దబ్బాయి బాబీకి కూడా ప్రొడక్షన్లో కొంత పాత్ర ఉన్నప్పటికీ.. అరవింద్ తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నది మాత్రం వాసునే. బన్నీతో ఉన్న స్నేహంతో గీతా ఆర్ట్స్‌లోకి వచ్చిన వాసు.. తన పనితనంతో అరవింద్‌ను మెప్పించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు అరవింద్ పేరే నిర్మాతగా పడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న సినిమాలకు బన్నీ వాసు పేరు ప్రొడ్యూసర్‌గా చూస్తున్నాం. పెద్ద బడ్జెట్ కాని సినిమాలను జీఏ2 బేనర్ మీద నిర్మిస్తూ వాటికి వాసు పేరునే నిర్మాతగా వేస్తున్నారు.

ఐతే త్వరలో బన్నీ వాసు వేరు కుంపటి పెడుతున్నట్లుగా ఇటీవల ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు బన్నీ వాసు. ‘‘ఈ విషయం కొంచెం తప్పుగా జనాల్లోకి వెళ్తోంది. నేను వేరే బేనర్ ఏమీ పెట్టట్లేదు. గీతా ఆర్ట్స్ నుంచి బయటికి రావట్లేదు. నాకు, అరవింద్ గారికి కొన్ని కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నాకు నచ్చింది ఆయనకు నచ్చకపోవచ్చు. ఆయనకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు.

మాలో ఎవరికి నచ్చకపోయినా ఆ ప్రాజెక్టును డ్రాప్ చేస్తుంటాం. ఐతే నేను అరవింద్ గారికి ఈ మధ్య ఒక మాట చెప్పా. నాకు ఏదైనా కథ నచ్చి, మీకు నచ్చకపోయినా వాటిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను అని. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఆ సినిమాలను కూడా జీఏ2 బేనర్ మీదే చేస్తాను. వేరే బ్యానర్లో చేయడం, నేను వేరు కుంపటి పెట్టడం లాంటివేమీ ఉండదు. నా అభిరుచికి తగ్గ సినిమాలను ప్రొడ్యూస్ చేయడం దీని ఉద్దేశం’’ అని బన్నీ వాసు తెలిపాడు.

This post was last modified on February 4, 2025 2:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌గ‌న్ చేయాల్సిన ఫ‌స్ట్ ప‌ని ఇదే.. వైసీపీ నేత‌ల డిమాండ్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని తాడేప‌ల్లికి చేరుకున్నారు. సుమారు 15-20 రోజుల పాటు ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు…

23 minutes ago

ప్రశాంత్ వర్మ మాటల్లో మర్మం ఏమిటో

హనుమాన్ బ్లాక్ బస్టర్ రిలీజై ఏడాది దాటేసింది. ఇప్పటిదాకా దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా మొదలుకాలేదు. జై హనుమాన్…

1 hour ago

వీరమల్లు రాక…. ఎవరికి లాభం ఎవరికి కష్టం!

పవన్ కళ్యాణ్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల మార్చి 28 అని టీమ్ పదే పదే…

1 hour ago

‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్క‌లు తీస్తున్న ఐటీ!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ఈ ఏడాది జూన్ - జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్ర‌మాలు,…

3 hours ago

బ్రెజిల్‌లో రూ.40 కోట్లకు ఒంగోలు ఆవు

బ్రెజిల్‌లో జరిగిన ఓ అద్భుతమైన వేలం బహుళ దేశాల్లో చర్చనీయాంశమైంది. వేలంలో భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఓ…

3 hours ago

తండేల్ బిజినెస్ టార్గెట్ ఎంత

ఇంకో మూడు రోజుల్లో తండేల్ విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్ద సినిమా ఇదే కావడంతో బయ్యర్ వర్గాలు…

3 hours ago