Movie News

గీత ఆర్ట్స్ నుండి బయటకి? : వాసు ఏమన్నారంటే…

టాలీవుడ్లో గొప్ప చరిత్ర ఉన్న బేనర్లలో ‘గీతా ఆర్ట్స్’ ఒకటి. ఆ సంస్థను నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు అల్లు అరవింద్. ఐతే తన నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కొడుకుల్లో ఒకరి చేతుల్లో పెడతారని అందరూ అనుకుంటే.. ఆయన మాత్రం బన్నీ వాసు అనే బయటి వ్యక్తిని ఎంతగానో నమ్మారు. అతనే చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ వ్యవహారాలను చూస్తున్నాడు.

అరవింద్ పెద్దబ్బాయి బాబీకి కూడా ప్రొడక్షన్లో కొంత పాత్ర ఉన్నప్పటికీ.. అరవింద్ తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నది మాత్రం వాసునే. బన్నీతో ఉన్న స్నేహంతో గీతా ఆర్ట్స్‌లోకి వచ్చిన వాసు.. తన పనితనంతో అరవింద్‌ను మెప్పించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు అరవింద్ పేరే నిర్మాతగా పడుతుంటే.. మిడ్ రేంజ్, చిన్న సినిమాలకు బన్నీ వాసు పేరు ప్రొడ్యూసర్‌గా చూస్తున్నాం. పెద్ద బడ్జెట్ కాని సినిమాలను జీఏ2 బేనర్ మీద నిర్మిస్తూ వాటికి వాసు పేరునే నిర్మాతగా వేస్తున్నారు.

ఐతే త్వరలో బన్నీ వాసు వేరు కుంపటి పెడుతున్నట్లుగా ఇటీవల ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చాడు బన్నీ వాసు. ‘‘ఈ విషయం కొంచెం తప్పుగా జనాల్లోకి వెళ్తోంది. నేను వేరే బేనర్ ఏమీ పెట్టట్లేదు. గీతా ఆర్ట్స్ నుంచి బయటికి రావట్లేదు. నాకు, అరవింద్ గారికి కొన్ని కథల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నాకు నచ్చింది ఆయనకు నచ్చకపోవచ్చు. ఆయనకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు.

మాలో ఎవరికి నచ్చకపోయినా ఆ ప్రాజెక్టును డ్రాప్ చేస్తుంటాం. ఐతే నేను అరవింద్ గారికి ఈ మధ్య ఒక మాట చెప్పా. నాకు ఏదైనా కథ నచ్చి, మీకు నచ్చకపోయినా వాటిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను అని. అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఆ సినిమాలను కూడా జీఏ2 బేనర్ మీదే చేస్తాను. వేరే బ్యానర్లో చేయడం, నేను వేరు కుంపటి పెట్టడం లాంటివేమీ ఉండదు. నా అభిరుచికి తగ్గ సినిమాలను ప్రొడ్యూస్ చేయడం దీని ఉద్దేశం’’ అని బన్నీ వాసు తెలిపాడు.

This post was last modified on February 4, 2025 2:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

26 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago