Movie News

కలెక్టర్ ముందూ ‘మంచు’ వారి వాదులాట

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు తిరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జరుగుతున్న యత్నాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు జరిగిన విచారణ సందర్భంగా మంచు వారు వాదులాటలకు దిగారట. ఫలితంగా ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి,. అంతేకాకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వచ్చారా?… లేదంటే వివాదాన్ని పెంచుకోవడానికి వచ్చారా? అంటూ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ హోదాలోని జిల్లా కలెక్టర్ మంచు వారిని మందలించారట. వెరసి ఈ వివాదానికి సోమవారం తెర పడుతుందని అంతా భావించినా… మరోమారు ఈ పంచాయతీపై విచారణ జరగనుంది.

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్ పల్లి పరిధిలో మోహన్ బాబుకు ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ ఫామ్ హౌజ్ లో మోహన్ బాబు ఉండగా… ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన దాని నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ అందులో ఉంటున్నారు. అయితే ఆ ఫామ్ హౌజ్ తనదని, దానిని మనోజ్ కు ఇవ్వలేదని చెబుతున్న మోహన్ బాబు… అందులో నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని అదికారులను ఆశ్రయించారు.

మంచు ఫ్యామిలీలో రేగిన ఈ ఆస్తుల పేచీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కన్న తండ్రి అని కూడా చేడకుండా మోహన్ బాబుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన ఘటన పెను కలకలమే రేపింది. ఈ ఘటనతో మోహన్ బాబు పలు చిక్కులు ఎదుర్కొన్నారు కూడా. అయితే ఎలాగోలా నెట్టుకువచ్చిన మోహన్ బాబు…మనోజ్ ను తన ఇంటి నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్… మనోజ్ ను ఇదివరకే ఓ దఫా విచారించారు. తాజాగా సోమవారం మనోజ్ తో పాటు మోహన్ బాబును కూడా కలెక్టర్ విచారణకు పిలిచారు. కలెక్టర్ ఆదేశాలతో మోహన్ బాబు, మనోజ్… ఇద్దరూ సోమవారం మధ్యాహ్నం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. వీరిద్దరినీ కలెక్టర్ దాదాపుగా రెండు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలెక్టర్ ముందే వాదులాటకు దిగారట. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. వివాద పరిష్కారం కోసం వచ్చారా?… లేదంటే వాదులాటకు వచ్చారా? అని మందలించారట. అంతేకాకుండా అప్పటికప్పుడు విచారణను ముగించిన కలెక్టర్… వచ్చే వారం మరోమారు విచారణకు రావాలని ఆదేశించారట. ఈ సారి అయినా వివాద పరిష్కారానికి సిద్ధపడి రావాలని కలెక్టర్ వారికి సూచించారట.

This post was last modified on February 3, 2025 7:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

9 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago