టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు తిరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జరుగుతున్న యత్నాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు జరిగిన విచారణ సందర్భంగా మంచు వారు వాదులాటలకు దిగారట. ఫలితంగా ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి,. అంతేకాకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వచ్చారా?… లేదంటే వివాదాన్ని పెంచుకోవడానికి వచ్చారా? అంటూ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ మేజిస్ట్రేట్ హోదాలోని జిల్లా కలెక్టర్ మంచు వారిని మందలించారట. వెరసి ఈ వివాదానికి సోమవారం తెర పడుతుందని అంతా భావించినా… మరోమారు ఈ పంచాయతీపై విచారణ జరగనుంది.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్ పల్లి పరిధిలో మోహన్ బాబుకు ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఈ ఫామ్ హౌజ్ లో మోహన్ బాబు ఉండగా… ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన దాని నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ అందులో ఉంటున్నారు. అయితే ఆ ఫామ్ హౌజ్ తనదని, దానిని మనోజ్ కు ఇవ్వలేదని చెబుతున్న మోహన్ బాబు… అందులో నుంచి మనోజ్ ను ఖాళీ చేయించాలని అదికారులను ఆశ్రయించారు.
మంచు ఫ్యామిలీలో రేగిన ఈ ఆస్తుల పేచీలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కన్న తండ్రి అని కూడా చేడకుండా మోహన్ బాబుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన ఘటన పెను కలకలమే రేపింది. ఈ ఘటనతో మోహన్ బాబు పలు చిక్కులు ఎదుర్కొన్నారు కూడా. అయితే ఎలాగోలా నెట్టుకువచ్చిన మోహన్ బాబు…మనోజ్ ను తన ఇంటి నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.
మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్… మనోజ్ ను ఇదివరకే ఓ దఫా విచారించారు. తాజాగా సోమవారం మనోజ్ తో పాటు మోహన్ బాబును కూడా కలెక్టర్ విచారణకు పిలిచారు. కలెక్టర్ ఆదేశాలతో మోహన్ బాబు, మనోజ్… ఇద్దరూ సోమవారం మధ్యాహ్నం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. వీరిద్దరినీ కలెక్టర్ దాదాపుగా రెండు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలెక్టర్ ముందే వాదులాటకు దిగారట. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. వివాద పరిష్కారం కోసం వచ్చారా?… లేదంటే వాదులాటకు వచ్చారా? అని మందలించారట. అంతేకాకుండా అప్పటికప్పుడు విచారణను ముగించిన కలెక్టర్… వచ్చే వారం మరోమారు విచారణకు రావాలని ఆదేశించారట. ఈ సారి అయినా వివాద పరిష్కారానికి సిద్ధపడి రావాలని కలెక్టర్ వారికి సూచించారట.
This post was last modified on February 3, 2025 7:07 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…