మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని రూపొందించిన తొలి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్ ఆ చిత్రం వంద కోట్ల క్లబ్బులోనూ అడుగు పటె్టింది. మోహన్ లాల్ మూవీ ‘బరోజ్’ పోటీలో ఉన్నా.. దాన్ని తొక్కి పడేసి ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది.
వారం తర్వాత ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తొలి రోజు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘మార్కో’ రికార్డు నెలకొల్పింది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ ఓవరాల్గా మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే ఇక్కడ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మరీ టూమచ్ వయొలెన్స్ ఉండడం.. కొన్ని సన్నివేశాలు భరించలేని విధంగా ఉండడంతో సమీక్షకులందరూ హెచ్చరికలు జారీ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో వామ్మో వాయ్యో అన్నారు.
యానిమల్, కిల్ లాంటి మోస్ట్ వయొలెంట్ సినిమాలు చూసి మెచ్చిన వాళ్లు కూడా.. దీని ముందు ఆ మూవీస్ దిగదుడుపే ఉన్నారు. ఐతే థియేటర్లలో చూసిన ఆ వయొలెన్సే తట్టుకోలేని విధంగా ఉంటే.. ఇప్పుడు ‘మార్కో’ డోస్ ఇంకా పెరగబోతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. థియేట్రికల్ కట్ విషయంలో కొన్ని సన్నివేశాల పట్ల సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టడంతో కోత పెట్టేశామని, వాటిని ఓటీటీ వెర్షన్లో జోడిస్తామని హీరో ఉన్ని ముకుందన్ ముందే చెప్పాడు.
ఇప్పుడు ఆ ప్రకారమే మరింత వయొలెంట్ సీన్లతో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. వయొలెంట్ మూవీస్ను ఇష్టపడేవారు కూడా థియేటర్లలో ‘మార్కో’ను చూసి తట్టుకోలేకపోయారు. చిన్న పిల్లల్ని, ఆడవాళ్లను తీవ్రంగా హింసించి చంపడం.. గర్భిణి కడుపులోంచి బిడ్డను బయటికి లాగడం.. తర్వాత ఆమె నోట్లో కత్తి దించి దారుణాతి దారుణంగా హత్య చేయడం లాంటి సీన్లకు బెంబేలెత్తిపోయిన జనాలు..
ఇంతకుమించిన వయొలెంట్ సీన్లను ఓటీటీలో చూసి ఏమైపోతారో? పిల్లలు, మహిళలు, సున్నిత మనస్కులు పొరపాటున కూడా ఈ సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో ఒక క్యాంపైనింగ్ నడపాల్సిన అవసరం ఉందని నెటిజన్లు విభిన్న భావాలు వ్యక్తపరుస్తున్నారు.
This post was last modified on February 3, 2025 6:47 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…