మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా గ్యారేజ్, భాగమతి లాంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని రూపొందించిన తొలి రోజు నుంచే మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్ ఆ చిత్రం వంద కోట్ల క్లబ్బులోనూ అడుగు పటె్టింది. మోహన్ లాల్ మూవీ ‘బరోజ్’ పోటీలో ఉన్నా.. దాన్ని తొక్కి పడేసి ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది.
వారం తర్వాత ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తొలి రోజు తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ‘మార్కో’ రికార్డు నెలకొల్పింది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ మూవీ ఓవరాల్గా మంచి ఫలితాన్నే అందుకుంది. ఐతే ఇక్కడ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మరీ టూమచ్ వయొలెన్స్ ఉండడం.. కొన్ని సన్నివేశాలు భరించలేని విధంగా ఉండడంతో సమీక్షకులందరూ హెచ్చరికలు జారీ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో వామ్మో వాయ్యో అన్నారు.
యానిమల్, కిల్ లాంటి మోస్ట్ వయొలెంట్ సినిమాలు చూసి మెచ్చిన వాళ్లు కూడా.. దీని ముందు ఆ మూవీస్ దిగదుడుపే ఉన్నారు. ఐతే థియేటర్లలో చూసిన ఆ వయొలెన్సే తట్టుకోలేని విధంగా ఉంటే.. ఇప్పుడు ‘మార్కో’ డోస్ ఇంకా పెరగబోతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. థియేట్రికల్ కట్ విషయంలో కొన్ని సన్నివేశాల పట్ల సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టడంతో కోత పెట్టేశామని, వాటిని ఓటీటీ వెర్షన్లో జోడిస్తామని హీరో ఉన్ని ముకుందన్ ముందే చెప్పాడు.
ఇప్పుడు ఆ ప్రకారమే మరింత వయొలెంట్ సీన్లతో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. వయొలెంట్ మూవీస్ను ఇష్టపడేవారు కూడా థియేటర్లలో ‘మార్కో’ను చూసి తట్టుకోలేకపోయారు. చిన్న పిల్లల్ని, ఆడవాళ్లను తీవ్రంగా హింసించి చంపడం.. గర్భిణి కడుపులోంచి బిడ్డను బయటికి లాగడం.. తర్వాత ఆమె నోట్లో కత్తి దించి దారుణాతి దారుణంగా హత్య చేయడం లాంటి సీన్లకు బెంబేలెత్తిపోయిన జనాలు..
ఇంతకుమించిన వయొలెంట్ సీన్లను ఓటీటీలో చూసి ఏమైపోతారో? పిల్లలు, మహిళలు, సున్నిత మనస్కులు పొరపాటున కూడా ఈ సినిమా చూడొద్దని సోషల్ మీడియాలో ఒక క్యాంపైనింగ్ నడపాల్సిన అవసరం ఉందని నెటిజన్లు విభిన్న భావాలు వ్యక్తపరుస్తున్నారు.
This post was last modified on February 3, 2025 6:47 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…