బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది. డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడంటే సెట్స్ మీద ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ లో పెట్టేశాడు కానీ ఫ్యాన్స్ కోసం ఒక వెరైటీ ఐడియాని రీ రిలీజ్ రూపంలో తీసుకొస్తున్నాడు.
2020 లో డైరెక్ట్ ఓటిటి ద్వారా రిలీజైన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. నేరుగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ యూత్ ఎంటర్ టైనర్ కి యూత్ లో భారీ స్పందన దక్కింది. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతకు పైసా వసూల్ అనిపించాయి.
ఆ టైంలో బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వాళ్ళ కోసం కృష్ణ అండ్ హిజ్ లీలని థియేట్రికల్ గా కొత్త పేరుతో రీ రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో. అంటే టైటిల్ ఇదే ఉండబోతోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా సమర్పకుడిగా వ్యవహరించిన దగ్గుబాటి రానా దీని బాధ్యతలను తీసుకున్నాడు.
ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయబోతున్నారు. చిన్న ప్రోమో వదిలారు. చూస్తుంటే సినిమాలో మిస్ అయిన సీన్లు, ఫుటేజ్ ఇప్పుడీ కొత్త వెర్షన్ లో చూసే ఛాన్స్ దక్కొచ్చు. శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన ఇట్స్ కాంప్లికేటెడ్ మంచి టైం కొట్టేసింది.
ఎందుకంటే లవర్స్ డే రోజు విడుదల ప్లాన్ చేసుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబా, విశ్వక్ సేన్ లైలా రెండు వాయిదా దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇవాళో రేపో అధికారిక ప్రకటనలు రావొచ్చు. అదే నిజమైతే బాక్సాఫీస్ దగ్గర స్పేస్ దొరుకుతుంది. రామ్ చరణ్ ఆరంజ్ వస్తోంది కానీ ఆల్రెడీ దీన్ని థియేటర్లో చూసిన జనాలు సిద్ధూ వైపు మొగ్గు చూపొచ్చు.
సిద్దార్థ్ ఓయ్ కూడా ఆల్రెడీ చూసేసిన బాపతే. గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న అతిథిని వేసవికి షిఫ్ట్ చేశారు. సో ప్రేమికులు సరదాగా సమయం గడపాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ మంచి ఆప్షన్ కావొచ్చు. అన్నట్టు ఇదే హీరో డైరెక్టర్ కాంబోలో రానా మరో సినిమా తీయబోతున్నాడు.
This post was last modified on February 3, 2025 11:32 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…