ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా ఫుటేజ్ దాకా ప్రతిదీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. కానీ ఒకప్పుడు ఇలా లేదు. ఫిలిం నెగటివ్ ని వాడేవారు. అంటే నలుపు రంగులో పొడవైన రీలుకు రెండువైపులా రంధ్రాలు చేసిన ఉన్న ఒక స్ట్రిప్ ని కెమెరాలో లోడ్ చేసి వాడేవారు.
కాకపోతే ఇది ఖరీదైన వ్యవహారం. ఒకవేళ ఏదైనా రీటేక్ చేయాలంటే కొత్త రీల్ అప్లోడ్ చేయాలి. ముందు తీసింది వృథా అయినట్టే. దీని వల్ల నిర్మాతలకు బోలెడు వ్యయ ప్రయాసలు ఉంటాయి. అందువల్లే దర్శకులు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని షాట్ తీసేవారు.
కొత్త యుగంలో ఆ సమస్య లేదు. డిజిటల్ కాబట్టి వేస్టేజ్ సమస్య లేదు. ఎన్నిసార్లు తీసినా ఖర్చు లేని డిలీట్ ఆప్షన్ వాడుకోవచ్చు. అందుకే టెక్నాలజీ మార్పు ఎన్నో రకాలుగా దోహదం చేసింది. అయితే రామ్ చరణ్ 16 సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాలో కొంత భాగానికి నెగటివ్ రీల్ వాడబోతున్నారట.
ఎందుకంటే ఇలా షూట్ చేసిన భాగాలు సహజమైన రంగులతో ఒరిజినల్ గా ఉంటాయి. ఆర్గానిక్ అనిపిస్తాయి. అతిగా కలర్ ఎక్స్ పోజ్ కావడం లాంటివి ఉండవు. పైగా మాస్టర్ నెగటివ్ ఉంటే రీ మాస్టరింగ్ చేసుకోవడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. ఈ మధ్య పాత రీ రిలీజులను ఇలాగే చేశారు.
ఆర్సి 16 జరిగే కాలం ముప్పై నలభై సంవత్సరాల వెనుక కాబట్టి నెగటివ్ తో ప్రయోగం చేయాలనేది రత్నవేలు ఆలోచన. సుప్రసిద్ధ ఫిలిం మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటికీ దీన్నే వాడుతుంటారు. ఓపెన్ హెయిమర్ మొత్తాన్ని అలాగే షూట్ చేసి నెగటివ్ రీల్స్ అన్నీ భద్రపరిచారు.
దీనికి చాలా ఖర్చయినా సరే వెనుకడుగు వేయలేదు. ఒకవేళ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆ భాగం కానక వర్కౌట్ అయితే మిగిలిన వాళ్ళు ఈ దారిలో వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కాకపోతే నెగటివ్ ఫిలిం అంత సులభంగా దొరకదు. వాడకం తగ్గింది కాబట్టి కంపెనీలు ఉత్పత్తి చేయడంలో కోత విధించాయి. మళ్ళీ పుంజుకోకపోవచ్చు.
This post was last modified on February 1, 2025 5:38 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…