పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడా అదే స్పందన వస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఎదురు చూశారు కానీ మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు.
నిన్న ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ విశాల్ దూరంగా ఉన్నాడు. ఆరోగ్య కారణమో మరింకేదైనానో చెప్పలేం కానీ మొత్తానికి బజ్ తెచ్చుకోవడంలో రాజా ఫెయిలయ్యాడు. రొటీన్ కంటెంట్ కావడంతో టాక్ అంతంతమాత్రంగానే ఉంది.
తమిళంలో అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం లేకపోలేదు. పొంగల్ పండక్కు వేరే పెద్ద హీరో సినిమా ఏదీ లేకపోవడంతో ఎంత రొటీన్ ఉన్నా సరే మదగజరాజాని అక్కడి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. వరస సెలవులు, విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన పాటలు దీనికి దోహదం చేశాయి.
కానీ తెలుగులో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఫేడ్ అవుట్ అయిన రొటీన్ కాన్సెప్ట్ ని టికెట్లు కొని థియేటర్లలో చూసేందుకు టాలీవుడ్ జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. సంతానం వన్ లైనర్స్ కామెడీ నవ్వించినప్పటికీ మొత్తాన్ని నిలబెట్టేందుకు అతనొక్కడే సరిపోలేదు. దీంతో ఇక్కడ హిట్టు ఆశలు లేనట్టే.
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత జనవరిలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాగా మదగజరాజనే నిలిచింది కానీ హైప్ తెచ్చుకోవడంలో విఫలం కావడం ప్రభావం చూపిస్తోంది. మణివణ్ణన్, మనోబాల లాంటి దివంగత ఆర్టిస్టులు ఉండటం వాళ్లకు కనెక్ట్ అవుతుందేమో కానీ మనకు మాత్రం అవుట్ డేటెడ్ ఫీలింగ్ ఇస్తుంది.
కమర్షియల్ మసాలాలు దిట్టంగా వేసినా వాటిలో వాసన మరీ పాతదిగా ఉండటంతో రుచి లేకుండా పోయింది. అందుకే సినిమాలకు రిలీజ్ టైమింగ్ చాలా ముఖ్యమని చెప్పేది. ఒకవేళ ఇదే మదగజరాజ వేరే సీజన్ లో వచ్చి ఖచ్చితంగా ఇంత ఫలితం వచ్చి ఉండేది కాదనేది వాస్తవం.
This post was last modified on February 1, 2025 5:24 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…