పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడా అదే స్పందన వస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఎదురు చూశారు కానీ మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు.
నిన్న ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ విశాల్ దూరంగా ఉన్నాడు. ఆరోగ్య కారణమో మరింకేదైనానో చెప్పలేం కానీ మొత్తానికి బజ్ తెచ్చుకోవడంలో రాజా ఫెయిలయ్యాడు. రొటీన్ కంటెంట్ కావడంతో టాక్ అంతంతమాత్రంగానే ఉంది.
తమిళంలో అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం లేకపోలేదు. పొంగల్ పండక్కు వేరే పెద్ద హీరో సినిమా ఏదీ లేకపోవడంతో ఎంత రొటీన్ ఉన్నా సరే మదగజరాజాని అక్కడి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. వరస సెలవులు, విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన పాటలు దీనికి దోహదం చేశాయి.
కానీ తెలుగులో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఫేడ్ అవుట్ అయిన రొటీన్ కాన్సెప్ట్ ని టికెట్లు కొని థియేటర్లలో చూసేందుకు టాలీవుడ్ జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. సంతానం వన్ లైనర్స్ కామెడీ నవ్వించినప్పటికీ మొత్తాన్ని నిలబెట్టేందుకు అతనొక్కడే సరిపోలేదు. దీంతో ఇక్కడ హిట్టు ఆశలు లేనట్టే.
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత జనవరిలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాగా మదగజరాజనే నిలిచింది కానీ హైప్ తెచ్చుకోవడంలో విఫలం కావడం ప్రభావం చూపిస్తోంది. మణివణ్ణన్, మనోబాల లాంటి దివంగత ఆర్టిస్టులు ఉండటం వాళ్లకు కనెక్ట్ అవుతుందేమో కానీ మనకు మాత్రం అవుట్ డేటెడ్ ఫీలింగ్ ఇస్తుంది.
కమర్షియల్ మసాలాలు దిట్టంగా వేసినా వాటిలో వాసన మరీ పాతదిగా ఉండటంతో రుచి లేకుండా పోయింది. అందుకే సినిమాలకు రిలీజ్ టైమింగ్ చాలా ముఖ్యమని చెప్పేది. ఒకవేళ ఇదే మదగజరాజ వేరే సీజన్ లో వచ్చి ఖచ్చితంగా ఇంత ఫలితం వచ్చి ఉండేది కాదనేది వాస్తవం.
This post was last modified on February 1, 2025 5:24 pm
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…
వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని…
రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర…