బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగులో సినిమాల్లో ఒక్క భరత్ అనే నేను మాత్రమే హిట్టయ్యింది. రామ్ చరణ్ తో చేసిన రెండు డిజాస్టర్ కావడం కాకతాళీయమే అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం ఫలితాల పట్ల కలవరపడుతున్నారు. వినయ విధేయ రామ కనీసం కమర్షియల్ గా పే చేసింది.
ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. టీవీలో వచ్చిన చాలాసార్లు టిఆర్పి రేటింగ్ భారీగా వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ దానికి నోచుకునేలా లేదు. సౌత్ ఇండియా మూవీస్ ని ఆచితూచి ఎంచుకుంటున్న కియారా ప్రస్తుతం యష్ టాక్సిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత కీలకం పూర్తి చేసి షూటింగ్ వేగవంతం చేశారు.
కానీ కియారా పెర్ఫార్మన్స్ పట్ల యష్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల హీరోయిన్ మార్పు ఉండొచ్చనే ప్రచారం బెంగళూరు వర్గాల్లో జోరుగా ఉంది. నిజానికీ అమ్మడికి నటన పరంగా ఛాలెంజింగ్ అనిపించే పాత్రలు మన సైడ్ దక్కలేదు. కేవలం హీరోని ప్రేమించి డ్యూయెట్లలో డాన్సులు చేయడానికి తప్పించి వేరేదానికి వాడుకోలేదు.
కానీ టాక్సిక్ అలా లేదట. కథానాయకిని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దరాట. ఆ రషెస్ చూశాకే యష్ వద్దని చెప్పాడని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ ఇప్పటిదాకా అయితే ఆమెనే చిత్రీకరణలో పాల్గొంటోంది.
ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రమోషన్లలో పాల్గొనకుండా దూరంగా ఉన్న కియారా కనీసం ఒక తెలుగు ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన పోలేదు. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కు వెళ్ళలేదు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన కారణంగా హిందీ బిగ్ బాస్ కు వెళ్ళింది. కానీ హైదరాబాద్ వచ్చి కనీసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
అసలు ముంబై నుంచి బయటికి వస్తేగా ఏదైనా భాగమవ్వడానికి. ప్యాన్ ఇండియా మూవీకి కియారా ఇలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వడం పట్ల మెగా ఫ్యాన్స్ ఆక్షేపించారు. సరే జరిగిందేదో జరిగింది కానీ టాక్సిక్ విషయంలో దర్శక నిర్మాతలు ఏదో ఒకటి అధికారిక ప్రకటన ఇవ్వడం బెటర్.
This post was last modified on February 1, 2025 4:00 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…