పదేళ్ల కిందట ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తన ప్రతిభను చాటాడు. తర్వాత తన నుంచి వచ్చిన ‘ప్రేమమ్’ ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ మీద అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది.
చందూ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం తన నుంచి రాబోతున్న ‘తండేల్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తర్వాత అతను కార్తికేయ-3 తీస్తానంటున్నాడు. ‘కార్తికేయ-2’ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దీనికి హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సినిమా మొదలు కాకముందే ఆ హైప్ను ఇంకా పెంచేలా దాని గురించి కొన్ని విశేషాలు చెప్పాడు చందూ ఒక ఇంటర్వ్యూలో.
కార్తికేయ-3 వేరే స్థాయిలో ఉంటుందని చందూ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘కార్తికేయ-3 కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. ఆ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. కార్తికేయ-2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్ను ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తి పూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. కార్తికేయ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది.
నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకునేవాడిని. కార్తికేయ-2 చూశాక చాలామంది పిల్లలు కృష్ణుడి గురించి పెదవాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసి సంతోషించాను. చాలామంది తల్లిదండ్రులు నన్ను కలిసినపుడు తమ పిల్లలు గోవర్ధన గిరి గురించి అడుగుతున్నారని చెప్పారు. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా’’ అని చందూ తెలిపాడు.
This post was last modified on January 31, 2025 4:29 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…