పదేళ్ల కిందట ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి తన ప్రతిభను చాటాడు. తర్వాత తన నుంచి వచ్చిన ‘ప్రేమమ్’ ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ మీద అందరికీ అనుమానాలు నెలకొన్నాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది.
చందూ మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం తన నుంచి రాబోతున్న ‘తండేల్’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తర్వాత అతను కార్తికేయ-3 తీస్తానంటున్నాడు. ‘కార్తికేయ-2’ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దీనికి హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సినిమా మొదలు కాకముందే ఆ హైప్ను ఇంకా పెంచేలా దాని గురించి కొన్ని విశేషాలు చెప్పాడు చందూ ఒక ఇంటర్వ్యూలో.
కార్తికేయ-3 వేరే స్థాయిలో ఉంటుందని చందూ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘కార్తికేయ-3 కోసం నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. కార్తికేయ-2 సక్సెస్ తర్వాత నా మీద ఎలాంటి బాధ్యత ఉందో నాకు తెలుసు. ఆ సినిమా కోసం లొకేషన్ల వేట కూడా పూర్తి చేశాను. కార్తికేయ-2తో కృష్ణ భగవానుడు నాకు గొప్ప జీవితాన్ని, కెరీర్ను ప్రసాదించాడు. నేనిప్పుడు భక్తి పూర్వకంగా నా కృతజ్ఞతను చాటుకోవాలి. కార్తికేయ థర్డ్ పార్ట్ కృష్ణ భగవానుడి చుట్టూనే తిరుగుతుంది.
నేను కృష్ణుడి గురించి జనాలకు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకునేవాడిని. కార్తికేయ-2 చూశాక చాలామంది పిల్లలు కృష్ణుడి గురించి పెదవాళ్లను అడిగి తెలుసుకుంటున్నారని తెలిసి సంతోషించాను. చాలామంది తల్లిదండ్రులు నన్ను కలిసినపుడు తమ పిల్లలు గోవర్ధన గిరి గురించి అడుగుతున్నారని చెప్పారు. నేను మన మూలాలు, సంస్కృతి, పురాణాల మీద మరిన్ని కథలు చెప్పాలనుకుంటున్నా’’ అని చందూ తెలిపాడు.
This post was last modified on January 31, 2025 4:29 pm
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…