ఈసారి సంక్రాంతికి కేవలం ఆరు నెలల సమయం ఉండగా మొదలైన చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. మేకింగ్ దశలో దీని గురించి పెద్దగా చర్చే లేదు. కానీ రిలీజ్ టైంకి ఫుల్ పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అయినా సరే.. రేంజ్ పరంగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ల తర్వాతి స్థానంలోనే దీన్ని నిలబెట్టారు ట్రేడ్ పండిట్లు. కానీ రిలీజ్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. మిగతా రెండు చిత్రాలను వెనక్కి నెట్టేసి రేసులో దూసుకెళ్లిపోయింది.
ఫ్యామిలీ సినిమాలకు ఉండే పరిమితులన్నింటినీ విసిరికొట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం అద్భుతాలు చేసింది. కేవలం 55 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన రీజనల్ మూవీ.. థియేటర్ల నుంచే రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ క్రమంలో మరెన్నో రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీ ఇదే. ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉన్న గ్రాస్, షేర్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది.
ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడో వీకెండ్లోకి అడుగు పెడుతోంది. అయినా ఈ శని, ఆదివారాల్లో సినిమా చాలా స్ట్రాంగ్గా నిలబడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో ఈ సినిమా ట్రెండింగ్లో ఉంది. ఇప్పటిదాకా ఆ యాప్లో ఈ సినిమా టికెట్ల 33 లక్షలు అమ్ముడవడం విశేషం. ఇప్పటిదాకా ఏ రీజనల్ తెలుగు మూవీకీ బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడవలేదు.
ఇతర టికెట్ బుకింగ్ యాప్స్ కూడా కలిపితే లెక్క చాలా పెద్దగానే ఉంటుంది. దీనికి తోడు వాకిన్స్ ఉండనే ఉన్నాయి. మొత్తంగా ఫుట్ ఫాల్స్ విషయంలో భారీ చిత్రాలకు దీటుగా నిలుస్తోంది ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి పర్ఫెక్ట్గా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం.. ఇలా అన్నీ కలిసి వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. వచ్చే శుక్రవారం ‘తండేల్’ వచ్చే వరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ జోరు కొనసాగబోతోంది.
This post was last modified on January 31, 2025 12:23 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…