సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా సినిమా వేడుకకు వచ్చినా.. ఇంటర్వ్యూలో పాల్గొన్నా చాలా డీసెంట్గా కనిపిస్తాడు. కానీ ఆయనతో దగ్గరగా గడిపిన వాళ్లు మాత్రం మహేష్ కామెడీ టైమింగే వేరని.. తన అల్లరి మామూలుగా ఉండదని అంటుంటారు. ఇక మహేష్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడని తన సోదరి మంజుల చెబుతూ ఉంటుంది. ఐతే చదువుకునే రోజుల్లో మహేష్ అల్లరి ఏ స్థాయిలో ఉండేదో ఇప్పుడు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
చెన్నైలో తాను, మహేష్ కలిసి చదువుకున్న విషయాన్ని అతను వెల్లడించాడు. విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ఓ తమిళ చిత్రం ‘ప్రేమిస్తావా’ పేరుతో రిలీజవుతున్న నేపథ్యంలో తెలుగు మీడియాకు అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా స్కూల్ డేస్లో మహేష్తో కలిసి తాను వేసిన అల్లరి వేషాల గురించి అతను వెల్లడించాడు.
ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో.. మహేష్ ఏమనుకుంటాడో అంటూనే.. పరీక్షల్లో పాస్ కావడం కోసం తాను, మహేష్ కలిసి క్వశ్చన్ పేపర్లు కొనేవాళ్లమని విష్ణువర్ధన్ తెలిపాడు. ఎవరో క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారని చెబితే.. మహేష్ బైక్ వేసుకుని వచ్చేవాడని.. ఇద్దరం వెళ్లి డబ్బులు పెట్టి పేపర్లు కొనేవాళ్లమని అతను తెలిపాడు.
ఐతే నిజానికి అవి ఫేక్ కశ్చన్ పేపర్లు అని.. తాము మోసపోయామని తర్వాత అర్థం అయ్యేదని.. వాటిని నమ్ముకుని తాను ఫెయిలయ్యేవాడినని.. కానీ మహేష్ మాత్రం ఎలాగో పాస్ అయిపోయేవాడని చెబుతూ విష్ణువర్ధన్ గట్టిగా నవ్వేశాడు. అతను మహేష్ గురించి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు డీసెంట్గా కనిపించే చాలామంది స్కూల్, కాలేజ్ డేస్లో అల్లరి వాళ్లే అయ్యుంటారు. అందుకు మహేష్ కూడా మినహాయింపు కాదని.. విష్ణువర్ధన్ ఇంటర్వ్యూలతో స్పష్టమైంది. ఈ విషయమై భవిష్యత్తులో ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు మహేష్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…