స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ అంటే.. షూటింగ్ స్పాట్లో, బయట ఈవెంట్లకు హాజరైనపుడు ఉండే హడావుడే వేరు. షూటింగ్ అంటే.. ఆ హీరోయిన్తో పాటు అరడజనుమందికి తక్కువ కాకుండా స్టాఫ్ వస్తారు. మేకప్ కోసం ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. హీరోయిన్కు ఒక కారవాన్ ఇవ్వాలి. తనతో పాటు స్టాఫ్కు బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి. స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేయాలి. ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి.
కొందరు హీరోయిన్లు ఈ సౌకర్యాల్లో కొన్ని మినహాయింపులు ఇస్తారు కానీ.. చాలావరకు స్టార్ కథానాయికలు అంటే ఈ హడావుడి ఉండాల్సిందే. కానీ సాయిపల్లవి మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె ఎంత సింపుల్గా ఉంటుందో చాలా సందర్భాల్లో అందరూ చూశారు. ఇప్పుడు తనతో ‘తండేల్’ సినిమా చేసిన దర్శకుడు చందూ మొండేటి మాటలు వింటే సాయిపల్లవి అందరూ అనుకునేదానికంటే చాలా సింపుల్ అని.. ఈ రోజుల్లో తనలా ఇంకే హీరోయిన్ ఉండలేదని అర్థమవుతుంది.
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి గురించి చందూ మాట్లాడుతూ.. ‘‘తనంత సింపుల్ హీరోయిన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. వేరే హీరోయిన్ల మాదిరి తనతో పాటు స్టాఫ్ ఎవ్వరూ ఉండరు. ఒక్కతే షూట్కు వచ్చేస్తుంది. వెంట మేకప్ కిట్లు లాంటివేమీ తెచ్చుకోదు. షూట్లో కూడా మేకప్కు చాలా వరకు దూరంగానే ఉంటుంది. జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తుంది. షూట్లో ఎంత ఇబ్బంది ఎదురైనా తట్టుకుంటుంది.
‘తండేల్’ కోసం సముద్రం మీద, ఒడ్డున ప్రమాదకరమైన సీన్లు తీశాం. ఎవ్వరి సాయం లేకుండా తన పని తాను చేసుకుంటుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ అంటే నడుచుకుంటూ వచ్చేస్తుంది. మా సినిమాలో ఎక్కువ సీన్లు సముద్రం నేపథ్యంలో ఎండలో తీయడం వల్ల ఆమెకు ట్యాన్ వచ్చేసింది. దీంతో ఆమె చేస్తున్న మరో సినిమా ‘రామాయణం’ టీం వాళ్లు లబోదిబోమన్నారు.
రామాయణం, అమరన్ లాంటి సినిమాల్లో నటిస్తూ కూడా ఎంతో ఓపిగ్గా మా సినిమా చిత్రీకరణలో పాల్గొంది. ఆమె గొప్ప నటి అని నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ సినిమా టైంలో ఆమె వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను’’ అని చందూ చెప్పాడు.
This post was last modified on January 30, 2025 7:28 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…