అంతా అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ ఈపాటికే రిలీజ్ అయిపోయి ఉండాలి. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లినపుడే 2025 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. మేకింగ్ చివరి దశకు వచ్చినపుడు కూడా దానికే కట్టుబడి ఉన్నారు. కానీ మూడు నెలల కిందట టీజర్ రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. ఆ టీజర్లో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడం.. సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరగడంతో చిత్ర బృందం పునరాలోచనలో పడింది.
సినిమాను అలాగే రిలీజ్ చేస్తే ‘ఆదిపురుష్’ ఫలితమే ఎదురవుతుందని భయపడింది. అందుకే వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టారు. ముందున్న సంస్థను తప్పించి.. వేరే సంస్థతో మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుండడంతో ఆలస్యం అనివార్యమైంది. సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా ఏ అధికారిక అప్డేట్ లేదు. కాగా ‘విశ్వంభర’కు సంబంధించి ఇప్పుడో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని.. విజువల్ ఎఫెక్ట్స్ పనులను పర్యవేక్షిస్తున్నాడని ఒక ఊహాగానం మొదలైంది. ‘కల్కి’ మూవీలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా వీఎఫెక్స్ ఔట్ పుట్ రాబట్టిన నేపథ్యంలో నాగికి కొంత కాలం పాటు ఈ పనులను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారని ప్రచారం నడుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ కొంచెం ఎగ్జైట్ అవుతున్నారు. కానీ ఈ ప్రచారం నిజం కాదని తెలుస్తోంది.
నాగి ‘కల్కి-2’ పనుల్లోనే బిజీగా ఉన్నాడట. ‘విశ్వంభర’ కోసం టైం పెట్టే పరిస్థితిలో లేడట. ‘విశ్వంభర’ టీం సైతం నాగిని సంప్రదించడం లాంటిదేమీ చేయలేదని సమాచారం. ముందున్న వీఎఫెక్స్ కంపెనీని తప్పించారు. దాని స్థానంలో సరైన టీంను తీసుకున్నారట. బహుశా ఈ విషయంలో నాగి నుంచో.. రాజమౌళి నుంచో సలహాలు అయితే తీసుకుని ఉండొచ్చు. రెఫరెన్సులు అడిగి ఉండొచ్చు.
అంతే తప్ప మరో దర్శకుడికి వీఎఫెక్స్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే లేదని సమాచారం. అన్నీ అనుకూలిస్తే చిరుకు ఎంతో కలిసి వచ్చిన మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on January 30, 2025 1:19 pm
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…