ఒకేసారి ఇద్దరు హీరోలకు ఒకే క్రేజీ టైటిల్ అవసరమైనప్పుడు దాని చుట్టూ తలెత్తే పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి. దానికో ప్రత్యక్ష ఉదాహరణ కళ్ళముందు కనిపిస్తోంది. ఇటీవలే అమరన్ తో అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధా కొంగర (ఆకాశం నీ హద్దురా) దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దశాబ్దాల క్రితం తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా వివాదాస్పద అంశాలతో రూపొందుతోంది. తొలుత సూర్యతో చేయాలని అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ తర్వాత ఏవేవో కారణాల వల్ల క్యాస్టింగ్ మారిపోయింది.
ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీకి పరాశక్తి అనే పేరుని నిర్ణయించినట్టు చెన్నై న్యూస్. ఇవాళ అధికారిక ప్రకటన రాబోతోందంట. ట్విస్ట్ ఏంటంటే విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందుతున్న శక్తి తిరుమగన్ మూవీకి ఇతర భాషల్లో పరాశక్తి టైటిల్ నే డిసైడ్ చేశారు. ఆ మేరకు అధికారికంగా పోస్టర్లు కూడా వదిలారు. ఇది అయోమయానికి దారి తీస్తోంది. ఇంకోవైపు చెన్నైకి చెందిన శివాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అసలెవరూ దీన్ని వాడుకోకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 1952లో వచ్చిన ఈ క్లాసిక్ అలాగే నిలిచిపోవాలంటే ఎవరూ ఈ పేరు పెట్టుకోకూడదని డిమాండ్ చేస్తోంది. లీగల్ గా మాత్రం అడ్డుకోలేదు.
చివరికి ఎవరు రాజీ పడతారో కానీ మొత్తానికి కోలీవుడ్ లో పరాశక్తి హాట్ టాపిక్ గా మారింది. ముందుగా రిలీజయ్యేది మాత్రం విజయ్ ఆంటోనీదే. వేసవి విడుదలని పోస్టర్ లో చెప్పేశారు. మరి ఈ పంచాయితీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. వాస్తవానికి పరాశక్తికున్న కల్ట్ స్టేటస్ చిన్నది కాదు. హిందీలో షోలే, తెలుగులో మాయాబజార్ లాగా తమిళంలో దీనికి అజరామరమైన కీర్తి ఉంది. అలాంటిది కమర్షియల్ ఎంటర్ టైనర్లకు ఎలా పెడతారనేది ఫ్యాన్స్ ప్రశ్న. తెలుగులో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. మిస్సమ్మ, శంకరాభరణం, అడవి రాముడు లాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ పేర్లను శుభ్రంగా వాడేశారు.
This post was last modified on January 29, 2025 3:40 pm
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…