హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు నార్త్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో కళ్లుచెదిరే వ్యూస్ తెచ్చుకుంటాయి. నెల రోజుల క్రితం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ తక్కువ టైంలో 100 మిలియన్ వ్యూస్ దాటేయడం అభిమానులనే ఆశ్చర్యపరుస్తోంది.
ట్విస్ట్ ఏంటంటే బ్లాక్ బస్టర్ మొదటి భాగం నాలుగు సంవత్సరాల క్రితం పెడితే ఇప్పటిదాకా 386 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కానీ అతి తక్కువ టైంలో డబుల్ ఇస్మార్ట్ ఇంత వేగంగా దూసుకుపోవడం అనూహ్యం. ఇలా అయితే ఏడాది లోపే ఫైవ్ హండ్రెడ్ మిలియన్లు దాటేలా ఉంది.
మన తెలుగు ఊర మాస్ సినిమాలను ఉత్తరాది ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడతారు. అందులోనూ రామ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నితిన్ లాంటి వాళ్ళకు ఈ మార్కెట్ చాలా పెద్దది. వారియర్, స్కంద లాంటివి సైతం మూడు వందల మిలియన్లు దాటేశాయి.
హలో గురు ప్రేమ కోసమే ఏకంగా 584 మిలియన్ వ్యూస్ తో టాప్ పొజిషన్ లో ఉంది. కేవలం రామ్ వి మాత్రమే చూస్తే వచ్చిన నెంబర్లు ఇవి. ఇతర హీరోలవి లెక్క వేసుకుంటే మతిపోవడం ఖాయం. డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా నటించడం, క్యాస్టింగ్ లో పలువురు బాలీవుడ్ నటీనటులు ఉండటం ఈ స్పందనకు కారణంగా చెప్పొచ్చు.
ఈ ట్రెండ్ ని గమనించి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సరైన మాస్ కంటెంట్ ఇస్తే జనాలు ఏ స్థాయిలో ఆదరిస్తారోనని. పుష్ప 2 ఎనిమిది వందల కోట్ల వసూళ్ల సాక్షిగా దీన్ని నిరూపించింది. భవిష్యత్తులో నార్త్ మార్కెట్ మనకు బంగారు గనిగా మారుతుంది. సరిగ్గా తవ్వుకుంటే కనకవర్షం కురుస్తుంది.
అక్కడి దర్శక రచయితలు చేయలేకపోతున్న మాస్ ఎంటర్ టైనర్లు తెలుగు డైరెక్టర్లు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ ఒకవేళ ఎలాంటి లోపాలు లేకపోయి ఉంటే థియేటర్లలోనూ వసూళ్ల రికార్డులు కొల్లగొట్టేది. పూరి జగన్నాథ్ ఇకనైనా తనలో వింటేజ్ ఫిలిం మేకర్ ని బయటికి తీసుకొచ్చి పోకిరి లాంటివి ఇవ్వాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on January 28, 2025 8:22 pm
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…