బాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ సినిమా.. చావా. గత ఏడాది డిసెంబరు తొలి వారంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు ‘పుష్ప-2’తో పోటీ పడడం మంచిది కాదని వెనక్కి తగ్గారు. షూట్ కూడా కొంచెం ఆలస్యం కావడంతో సినిమాను ఫిబ్రవరి 14కు వాయిదా వేశారు. రిలీజ్ ముంగిట సినిమాను చిత్ర బృందంలో గట్టిగా ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.
కానీ అందులో కొన్ని షాట్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐతే ట్రైలర్లో శంభాజీ పాత్రధారి అయిన విక్కీ కౌశల్ డ్యాన్సులు వేయడం మరాఠీలను హర్ట్ చేసింది. దీంతో పాటు కొన్ని సీన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం సదరు సన్నివేశాల మీద అభ్యంతరం చెప్పారు.
చరిత్రను వక్రీకరించడం తప్పన్నారు. మరో మంత్రి సైతం చరిత్రను వక్రీకరిస్తే సినిమాను ఆడనివ్వమని తేల్చి చెప్పారు. వ్యవహారం సీరియస్గా మారడంతో చిత్ర బృందం వెనక్కి తగ్గింది. అభ్యంతరంగా అనిపిస్తున్న ప్రతి సన్నివేశాన్నీ సినిమా నుంచి తొలగిస్తామని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ స్పష్టం చేశారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు మహారాష్ట్రలోనే అడ్డంకులు ఎదురైతే.. చాలా కష్టమవుతుంది.
అందుకే ఆలస్యం చేయకుండా చిత్ర బృందం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొందరు స్కాలర్లకు చూపించి.. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రిలీజ్ చేయాలని కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అవసరమైతే ఆ పని కూడా చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. విక్కీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటించింది ఈ చిత్రంలో. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో తనకు ఈ చిత్రం మరో బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశిస్తోంది.
This post was last modified on January 28, 2025 6:27 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…