Movie News

కొత్త సందేహాలకు తెర తీసిన వీరమల్లు

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికంతా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కావడం కష్టమనే వార్తలు విశ్వసనీయ వర్గాల ద్వారా రావడంతో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర సూరన్ పార్ట్ 2 (కాళి), ఎల్2 ఎంపురాన్ ఆఘమేఘాల మీద ఆ డేట్ ముందు వెనుకా వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.

వీటిలో చివరిదైన మోహన్ లాల్ మూవీ మాత్రమే ఎప్పుడో అధికారిక ప్రకటన ఇచ్చింది కానీ మిగిలినవి మాత్రం ఇటీవల అనౌన్స్ మెంట్లు వచ్చినవే. తాజాగా మరో ట్విస్టు వచ్చి పడింది. కొత్త అనుమానాలకు తావిచ్చేలా చర్చ నడుస్తోంది.

బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషించిన ఔరంగజేబ్ పాత్రని రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ఒకటి వదిలారు. అందులో మార్చి 28 తేదీనే ఉంది. అంటే వాయిదా సూచనలు లేవని చెబుతున్నారని అనుకోవాలా అంటూ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజానికి హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం పోస్ట్ పోన్ గురించి ఎప్పుడూ చెప్పలేదు.

కాకపోతే ప్రమోషన్ల స్పీడ్ పెంచకపోవడం అనే ఒక కంప్లయింట్ తప్ప ఫ్యాన్స్ కి ఇది టైంకి రావాలనే ఉంది. కానీ మైత్రి, సితార లాంటి పెద్ద సంస్థలు వీరమల్లు డేట్ ని తీసుకున్నాయంటే ఖచ్చితంగా పవర్ స్టార్ రావడం లేదనే అర్థం వస్తుంది. అందుకే ఇంత అయోమయం.

ప్రస్తుతం చివరి దశలో ఉన్న హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ ఇంకో వారం రోజులు డేట్స్ ఇస్తే మొత్తం అయిపోతుందని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే మంగళగిరి ప్రాంతాల్లో ప్రత్యేక సెట్లు వేస్తున్నారని సమాచారం. డిప్యూటీ సిఎంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్ కు డేట్లు సర్దుబాటు చేయడం పెద్ద సవాల్ గా మారింది.

ఓజి కూడా బ్యాలన్స్ ఉంది. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలి. ఈ మూడు అయిపోతే సీరియస్ పొలిటీషియన్ గా ఎక్కువ సమయం మంత్రిగా గడపాలని నిర్ణయించుకున్నారట. ఏదో ఒకటి ముందైతే హరిహర వీరమల్లు మార్చి 28కి వచ్చేది లేనిది ఏదైనా ప్రమోషన్ ద్వారా క్లారిటీ ఇస్తే బెటర్.

This post was last modified on January 27, 2025 11:48 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago