ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య.. ‘నరసింహనాయుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ఆయన సినిమాలు ట్రోల్ మెటీరియల్స్గా మారిపోయి. ఒక దశలో ఆయనిక పుంజుకోవడం కష్టమే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు కూడా. కానీ ‘సింహా’ మూవీతో బలంగా పుంజుకున్నాడు బాలయ్య.
ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక హిట్ కొట్టడం.. మళ్లీ డౌన్ అవడం.. ఇలా సాగింది ఆయన కెరీర్. 2019లో యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ చిత్రాలు చేదు అనుభవాలను మిగల్చడంతో మళ్లీ బాలయ్య కెరీర్లో పతనం మొదలైనట్లే కనిపించింది. బాలయ్య మార్కెట్ను బాగా దెబ్బ తీశాయి ఆ చిత్రాలు. ఇక మళ్లీ బాలయ్య రైజ్ కావడం కష్టమే అనుకున్నారు చాలామంది.
కానీ ఇప్పుడు చూస్తే బాలయ్య సక్సెస్ రేట్ను అందుకోవడం వేరే హీరోలకు కష్టంగా ఉంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లతో తిరుగులేని స్థితికి చేరుకున్నాడీ నందమూరి హీరో. 2021లో వచ్చిన ‘అఖండ’ మూవీతో బాలయ్య దశ తిరిగింది. అంతకుముందు బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ల ఇచ్చిన బోయపాటి.. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అందించాడు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయింది.
తర్వాత ఒకే ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నాడు బాలయ్య. దీంతో హ్యాట్రిక్ పూర్తయింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో సంక్రాంతికి మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు విడుదల ముంగిట తక్కువ బజ్ కనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. హిట్ టాక్ తెచ్చుకున్న ‘డాకు మహారాజ్’ సంక్రాంతి అడ్వాంటేజ్ను పూర్తిగా వాడుకుని భారీ వసూళ్లు రాబట్టింది.
బాలయ్య కెరీర్లో మరో బిగ్ హిట్గా నిలిచింది. కెరీర్లో ఈ దశలో బాలయ్య ఇలా వరుసగా విజయాలు సాధించడం, మళ్లీ కెరీర్ పీక్స్ను అందుకోవడం అనూహ్యం. ఆయన సక్సెస్ స్ట్రీక్ చూసి మిగతా హీరోలు అసూయ చెందుతుంటే ఆశ్చర్యం లేదు.
This post was last modified on January 25, 2025 5:13 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…