ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన బాలయ్య.. ‘నరసింహనాయుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఎంత ఇబ్బంది పడ్డాడో తెలిసిందే. ఆయన సినిమాలు ట్రోల్ మెటీరియల్స్గా మారిపోయి. ఒక దశలో ఆయనిక పుంజుకోవడం కష్టమే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు కూడా. కానీ ‘సింహా’ మూవీతో బలంగా పుంజుకున్నాడు బాలయ్య.
ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక హిట్ కొట్టడం.. మళ్లీ డౌన్ అవడం.. ఇలా సాగింది ఆయన కెరీర్. 2019లో యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ చిత్రాలు చేదు అనుభవాలను మిగల్చడంతో మళ్లీ బాలయ్య కెరీర్లో పతనం మొదలైనట్లే కనిపించింది. బాలయ్య మార్కెట్ను బాగా దెబ్బ తీశాయి ఆ చిత్రాలు. ఇక మళ్లీ బాలయ్య రైజ్ కావడం కష్టమే అనుకున్నారు చాలామంది.
కానీ ఇప్పుడు చూస్తే బాలయ్య సక్సెస్ రేట్ను అందుకోవడం వేరే హీరోలకు కష్టంగా ఉంది. వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లతో తిరుగులేని స్థితికి చేరుకున్నాడీ నందమూరి హీరో. 2021లో వచ్చిన ‘అఖండ’ మూవీతో బాలయ్య దశ తిరిగింది. అంతకుముందు బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ల ఇచ్చిన బోయపాటి.. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అందించాడు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని రేంజికి వెళ్లిపోయింది.
తర్వాత ఒకే ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నాడు బాలయ్య. దీంతో హ్యాట్రిక్ పూర్తయింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’తో సంక్రాంతికి మరో ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు విడుదల ముంగిట తక్కువ బజ్ కనిపించింది కానీ.. రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. హిట్ టాక్ తెచ్చుకున్న ‘డాకు మహారాజ్’ సంక్రాంతి అడ్వాంటేజ్ను పూర్తిగా వాడుకుని భారీ వసూళ్లు రాబట్టింది.
బాలయ్య కెరీర్లో మరో బిగ్ హిట్గా నిలిచింది. కెరీర్లో ఈ దశలో బాలయ్య ఇలా వరుసగా విజయాలు సాధించడం, మళ్లీ కెరీర్ పీక్స్ను అందుకోవడం అనూహ్యం. ఆయన సక్సెస్ స్ట్రీక్ చూసి మిగతా హీరోలు అసూయ చెందుతుంటే ఆశ్చర్యం లేదు.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…