సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టమైపోతోంది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల తరహాలో తమ వయసులో సగం, మూడో వంతు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇప్పటి సీనియర్ హీరోలు ఇబ్బంది పడిపోతున్నారు. ఈ తరం ప్రేక్షకులు కూడా అలాంటి జోడీలను చూడటానికి ఇష్టపడట్లేదు. యువ కథానాయకులతో ఆడిపాడుతున్న యంగ్ స్టార్ హీరోయిన్లు సీనియర్ల పక్కన నటిస్తే వాళ్లకు ఏదోలా అనిపిస్తోంది.
కొన్ని సినిమాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి కాంబినేషన్లు కుదురుతున్నా.. చాలా వరకు ఇబ్బంది తప్పట్లేదు. దీంతో సీనియర్ల కోసం అంతగా ఫేమ్ లేని, వేరే ఇండస్ట్రీల అమ్మాయిల్ని వెతికి వెతికి తీసుకొస్తున్నారు. లేదంటే అంతకుముందు పని చేసిన సీనియర్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు.
ఇలా హీరోయిన్లను సెట్ చేయడంలో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. గత కొన్నేళ్లలో బాలయ్య సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా అంతగా క్రేజ్ లేని హీరోయిన్లతో నెట్టుకొస్తున్నారు. చివరగా ఆయన నటించిన ‘రూలర్’లో సోనాలి చౌహాన్, వేదిక లాంటి ఔట్ డేటెడ్ హీరోయిన్లే నటించారు. ఇక బాలయ్య-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా సరైన హీరోయిన్ సెట్టవ్వలేదు. ఈ సినిమాను కరోనాకు ముందే హీరోయిన్ ఫిక్స్ కాకుండానే మొదలుపెట్టారు. లాక్ డౌన్ టైంలో కూడా హీరోయిన్ ఓకే కాలేదు. గత కొన్ని నెలల్లో రకరకాల పేర్లు వినిపించాయి.
చివరికిప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని కథానాయికను ఈ చిత్రానికి ఓకే చేశారట. ఆమె పేరు ప్రయాగ మార్టిన్. ఈ అమ్మాయి తెలుగులోకి ‘పిశాచి’ పేరుతో డబ్ అయిన తమిళ చిత్రం ‘పిసాసు’లో నటించింది. అందులో ఆమెది దయ్యం పాత్ర. సినిమాలో ఆమె ఒరిజినల్ ముఖం కనిపించేది కొన్ని నిమిషాలే. మలయాళ అమ్మాయి అయిన ప్రయాగ.. అంత పాపులర్ హీరోయినేమీ కాదు. మరి బాలయ్య పక్కన ఈమెను ఎంపిక చేయడానికి కారణమేంటో?
This post was last modified on October 17, 2020 10:18 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…