గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి చాలా టైముంది. మోక్షజ్ఞ డెబ్యూని దక్కించుకున్నా డిసెంబర్ లో ప్రారంభోత్సవం వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు.
ఈలోగా తన రచన నిర్మాణంలో వేరే దర్శకురాలితో ప్రశాంత్ వర్మ మహాకాళిని ప్రకటించాడు. అధీరా పనులు చూసుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ భేడియా 2లోనూ చెయ్యి వేస్తున్నాడనే టాక్ ఉంది కానీ సరైన సమాచారం లేదు. కథ అందించిన దేవకీనందన వాసుదేవ ఆడలేదు.
ఇవన్నీ ఎలా ఉన్నా దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడమే భేతాళ ప్రశ్నగా మారింది. ఒకవేళ మోక్షజ్ఞది మరింత ఆలస్యం అనుకుంటే ఇంకో ప్రాజెక్టు మొదలుపెట్టడం ఉత్తమం. కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి వస్తే తప్ప జై హనుమాన్ ని స్టార్ట్ చేయలేని పరిస్థితి.
ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీ చెయ్యి దాకా వచ్చి జారిపోయింది. హనుమాన్ టైంలో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో ప్రశాంత్ వర్మ జాగ్రత్తగా వేస్తున్న అడుగులు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ లెక్కన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదేమో.
ఏదైనా నేరుగా అడుగుదామంటే ప్రశాంత్ వర్మ అందుబాటులోకి రావడం లేదు. కొత్త ఆఫీస్ లో బిజీగా ఉంటున్నాడు తప్పించి ఏదైనా ఈవెంట్ లోనూ దర్శనం ఇవ్వడం లేదు. వచ్చినా మోక్షజ్ఞ గురించి అడుగుతారు కాబట్టి అదేంటో తేలేవరకు అంత సులభంగా బయట కనిపించకపోవచ్చు.
ఇంకోవైపు జాంబీ రెడ్డి 2ని వేరే దర్శకుడితో సితార బ్యానర్ మీద నిర్మించే ప్రతిపాదన దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. అయినా హనుమాన్ లాంటి అంత పెద్ద హిట్టు కొట్టాక ఈ గ్యాప్ రావడం విచిత్రమే. వచ్చిన వాటిలో ఒకటి క్యాన్సిల్, మరొకటి డిలే కావడం విధి లిఖితం. ఇంకొద్దిరోజుల్లో ఏమైనా క్లారిటీ రావొచ్చు.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…