Movie News

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై హనుమాన్ ప్రకటన వచ్చింది కానీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి చాలా టైముంది. మోక్షజ్ఞ డెబ్యూని దక్కించుకున్నా డిసెంబర్ లో ప్రారంభోత్సవం వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు.

ఈలోగా తన రచన నిర్మాణంలో వేరే దర్శకురాలితో ప్రశాంత్ వర్మ మహాకాళిని ప్రకటించాడు. అధీరా పనులు చూసుకుంటున్నాడు. బాలీవుడ్ మూవీ భేడియా 2లోనూ చెయ్యి వేస్తున్నాడనే టాక్ ఉంది కానీ సరైన సమాచారం లేదు. కథ అందించిన దేవకీనందన వాసుదేవ ఆడలేదు.

ఇవన్నీ ఎలా ఉన్నా దర్శకుడిగా ప్రశాంత్ వర్మ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడమే భేతాళ ప్రశ్నగా మారింది. ఒకవేళ మోక్షజ్ఞది మరింత ఆలస్యం అనుకుంటే ఇంకో ప్రాజెక్టు మొదలుపెట్టడం ఉత్తమం. కాంతార చాప్టర్ 1 పూర్తి చేసుకుని రిషబ్ శెట్టి వస్తే తప్ప జై హనుమాన్ ని స్టార్ట్ చేయలేని పరిస్థితి.

ఆల్రెడీ రణ్వీర్ సింగ్ ప్యాన్ ఇండియా మూవీ చెయ్యి దాకా వచ్చి జారిపోయింది. హనుమాన్ టైంలో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో ప్రశాంత్ వర్మ జాగ్రత్తగా వేస్తున్న అడుగులు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ లెక్కన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదేమో.

ఏదైనా నేరుగా అడుగుదామంటే ప్రశాంత్ వర్మ అందుబాటులోకి రావడం లేదు. కొత్త ఆఫీస్ లో బిజీగా ఉంటున్నాడు తప్పించి ఏదైనా ఈవెంట్ లోనూ దర్శనం ఇవ్వడం లేదు. వచ్చినా మోక్షజ్ఞ గురించి అడుగుతారు కాబట్టి అదేంటో తేలేవరకు అంత సులభంగా బయట కనిపించకపోవచ్చు.

ఇంకోవైపు జాంబీ రెడ్డి 2ని వేరే దర్శకుడితో సితార బ్యానర్ మీద నిర్మించే ప్రతిపాదన దాదాపు ఓకే అయ్యిందని అంటున్నారు. అయినా హనుమాన్ లాంటి అంత పెద్ద హిట్టు కొట్టాక ఈ గ్యాప్ రావడం విచిత్రమే. వచ్చిన వాటిలో ఒకటి క్యాన్సిల్, మరొకటి డిలే కావడం విధి లిఖితం. ఇంకొద్దిరోజుల్లో ఏమైనా క్లారిటీ రావొచ్చు.

This post was last modified on January 22, 2025 3:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

18 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago