తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్ 150తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాక రికార్డుల పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నది వాల్తేర్ వీరయ్య ఒక్కటే. సైరా నరసింహారెడ్డి భారీ రెవిన్యూ చూసినా ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేదు.
గాడ్ ఫాదర్ కంటెంట్ కు మెప్పులు వచ్చాయి కానీ అనుకున్న స్థాయిలో డబ్బులు రాలేదు. ఇక ఆచార్య, భోళా శంకర్ గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. ఇవన్నీ పది ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నిన్నటి తరం దర్శకులు హ్యాండిల్ చేసినవి. పొరపాటు ఇక్కడ జరుగుతోందని చిరు గుర్తించిన్నట్టున్నారు.
క్రమంగా ట్రాక్ రెకార్డున్న ఇప్పటి డైరెక్టర్లతోనే చేతులు కలుపుతూ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. విశ్వంభర తీస్తున్న వశిష్టకు ఇదింకా రెండో సినిమానే. టీజర్ మీద కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ విఎఫెక్స్ మీద మళ్ళీ రీ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని ఇన్ సైడ్ టాక్.
తీసిన ఎనిమిది చిత్రాల్లో అపజయమే ఎరుగని అనిల్ రావిపూడితో మెగా టైఅప్ కావడం ఫ్యాన్స్ అంచనాలను ఇప్పటి నుంచే పెంచుతోంది. కేవలం అనౌన్స్ మెంట్ తోనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు మీద హైప్ వచ్చింది. మొదలుపెట్టడానికి ఇంకా చాలా టైం ఉన్నా అప్పుడే టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.
మరోసారి బాబీ కాంబో రిపీట్ చేయాలని చిరు నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వాల్తేరు వీరయ్యలో తనను బాగా ప్రెజెంట్ చేయడంతో పాటు ఇటీవలే డాకు మహారాజ్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వైనం ఇంకో కథను సిద్ధం చేసే దిశగా పురమాయించిందట. ఇప్పుడీ ఇన్నింగ్స్ లో ఎంచుకుంటున్న దర్శకులందరూ కొత్త జనరేషనే.
సక్సెస్ ఫామ్ లో ఉన్నవాళ్లే. సరైన కంటెంట్ తో మెప్పించగలిగితే మాత్రం వింటేజ్ చిరంజీవిని చూడొచ్చు. ఆయన కోరిక కూడా అదే. ఈ లెక్కన రాబోయే రెండేళ్లు చిరు డైరీ నిండిపోయేలా ఉంది. సబ్జెక్టు కుదిరితే భవిష్యత్తులో వెంకీ అట్లూరికి కూడా ఛాన్స్ దక్కనుంది.
This post was last modified on January 22, 2025 7:46 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…