తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్ 150తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాక రికార్డుల పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నది వాల్తేర్ వీరయ్య ఒక్కటే. సైరా నరసింహారెడ్డి భారీ రెవిన్యూ చూసినా ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేదు.
గాడ్ ఫాదర్ కంటెంట్ కు మెప్పులు వచ్చాయి కానీ అనుకున్న స్థాయిలో డబ్బులు రాలేదు. ఇక ఆచార్య, భోళా శంకర్ గురించి మాట్లాడకపోవడం ఉత్తమం. ఇవన్నీ పది ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నిన్నటి తరం దర్శకులు హ్యాండిల్ చేసినవి. పొరపాటు ఇక్కడ జరుగుతోందని చిరు గుర్తించిన్నట్టున్నారు.
క్రమంగా ట్రాక్ రెకార్డున్న ఇప్పటి డైరెక్టర్లతోనే చేతులు కలుపుతూ పక్కా ప్లానింగ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. విశ్వంభర తీస్తున్న వశిష్టకు ఇదింకా రెండో సినిమానే. టీజర్ మీద కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ విఎఫెక్స్ మీద మళ్ళీ రీ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అవుట్ ఫుట్ చాలా బాగా వస్తోందని ఇన్ సైడ్ టాక్.
తీసిన ఎనిమిది చిత్రాల్లో అపజయమే ఎరుగని అనిల్ రావిపూడితో మెగా టైఅప్ కావడం ఫ్యాన్స్ అంచనాలను ఇప్పటి నుంచే పెంచుతోంది. కేవలం అనౌన్స్ మెంట్ తోనే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు మీద హైప్ వచ్చింది. మొదలుపెట్టడానికి ఇంకా చాలా టైం ఉన్నా అప్పుడే టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.
మరోసారి బాబీ కాంబో రిపీట్ చేయాలని చిరు నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వాల్తేరు వీరయ్యలో తనను బాగా ప్రెజెంట్ చేయడంతో పాటు ఇటీవలే డాకు మహారాజ్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వైనం ఇంకో కథను సిద్ధం చేసే దిశగా పురమాయించిందట. ఇప్పుడీ ఇన్నింగ్స్ లో ఎంచుకుంటున్న దర్శకులందరూ కొత్త జనరేషనే.
సక్సెస్ ఫామ్ లో ఉన్నవాళ్లే. సరైన కంటెంట్ తో మెప్పించగలిగితే మాత్రం వింటేజ్ చిరంజీవిని చూడొచ్చు. ఆయన కోరిక కూడా అదే. ఈ లెక్కన రాబోయే రెండేళ్లు చిరు డైరీ నిండిపోయేలా ఉంది. సబ్జెక్టు కుదిరితే భవిష్యత్తులో వెంకీ అట్లూరికి కూడా ఛాన్స్ దక్కనుంది.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…