Movie News

సల్మాన్ మీద అక్షయ్ అలిగాడా?

వివిధ భాషల్లో కొత్త సినిమాలను ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో ప్రమోట్ చేయడం కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండ్. ఈ ట్రెండుకు శ్రీకారం చుట్టింది బాలీవుడ్డే. హిందీలోనే మొదటగా ఈ షో మొదలైంది. ఆ షోలో సినిమాల ప్రమోషన్ చేయడం కూడా ముందు మొదలుపెట్టింది అక్కడే. సంక్రాంతి సినిమా ‘గేమ్ చేంజర్’ను సైతం బిగ్ బాస్‌లో ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రమోట్ చేయాలనుకున్నారు.

అక్షయ్‌తో పాటు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన వీర్ పహారియా సైతం షోకు వచ్చాడు. ఐతే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా అక్షయ్ అలిగి మధ్యలోనే వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అక్షయ్ ఈ షోకు వచ్చినట్లు ఆన్ లొకేషన్ ఫొటోలు బయటికి వచ్చినా.. పూర్తి ఎపిసోడ్‌లో కనిపించలేదు. చిత్రీకరణ కోసం సల్మాన్ ఆలస్యంగా రావడంతో అక్షయ్ అలిగి వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది.ఈ విషయమై అక్షయ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు.

సల్మాన్‌తో తనకు విభేదాలున్నట్లు వచ్చిన వార్తలను సైతం అతను ఖండించాడు. ‘‘సల్మాన్ సెట్‌కు 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మాట వాస్తవం. కానీ అతను లేటుగా రావడం వల్ల నేను అలిగి సెట్ నుంచి వచ్చేయలేదు. నాకు వేరే సినిమా షూటింగ్ ఉంది. దానికి తప్పక హాజరు కావాలి. అందుకే బిగ్ బాస్ సెట్ నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సల్మాన్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. నేను వచ్చేసినా మా సినిమాను ప్రమోట్ చేయడం కోసం వీర్ పహారియా అక్కడే ఉన్నాడు.

అతను సల్మాన్‌తో కలిసి మా సినిమా విశేషాలను పంచుకున్నాడు. అంతకుమించి ఇందులో వివాదం ఏమీ లేదు’’ అని అక్షయ్ చెప్పడంతో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. మరోవైపు సైఫ్ మీద జరిగిన దాడి గురించి అక్షయ్ ఈ ఇంటర్వ్యూలో స్పందించాడు. కుటుంబం కోసం పోరాడిన రియల్ హీరో సైఫ్ అని ప్రశంసించాడు. తామిద్దరం కలిసి ‘మే ఖిలాడి తు అనారి’ అనే సినిమా చేశామని.. ఇప్పుడు మళ్లీ తాము కలిసి సినిమా చేయాల్సి వస్తే దానికి ‘తు ఖిలాడి మే అనారి’ అనే టైటిల్ పెట్టాల్సి ఉంటుందని అక్షయ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

This post was last modified on January 21, 2025 5:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

56 seconds ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

48 minutes ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

1 hour ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

2 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

2 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

2 hours ago