కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు. వీటి సరసన చోటు దక్కించుకున్న బ్లాక్ బస్టర్ పాతాళ్ లోక్ (2020). అయిదేళ్ల తర్వాత రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగంకు చాలా ప్రశంసలు దక్కాయి. వ్యూస్ పరంగా అమెజాన్ ప్రైమ్ కు భారీ ఆదాయం వచ్చింది.
మరింత గ్రాండ్ గా సెకండ్ సీజన్ తీశారు. క్యాస్టింగ్ ని కొనసాగిస్తూనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పెద్ద హీరో లేకుండా జైదీప్ ఆహ్లావత్ లాంటి సపోర్టింగ్ ఆర్టిస్టు మీద ఇంత బడ్జెట్ పెట్టడం చిన్న విషయం కాదు. తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉన్న పాతాళ్ లోక్ 2 ఎలా ఉందంటే.
నాగాలాండ్ లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమ్మిట్ కు వచ్చిన జోనాథన్ తామ్ తన హోటల్ గదిలో దారుణంగా హత్యకు గురవుతాడు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకున్న ఇమ్రాన్ అన్సారీ (ఇశ్వాక్ సింగ్) తనకు సహాయంగా హాథీరాం చౌదరి (జైదీప్ ఆహ్లావత్) తీసుకుని నాగాలాండ్ వెళ్తాడు.
కానీ అక్కడ పరిస్థితులు వీళ్ళను ప్రమాదంలో నెడతాయి. రెండు మర్డర్ కేసులకు మూలాలు అక్కడే ఉన్నాయని అర్థమవుతుంది. బిజినెస్ మ్యాన్ కపిల్ రెడ్డి (నగేష్ కుకునూర్) ప్రమేయం తెలిశాక రిస్క్ ఇంకా పెరుగుతుంది. అయితే అసలు దోషులు ఎవరనేది మాత్రం సిరీస్ లో చూస్తేనే అసలు థ్రిల్.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో సుమారు ఆరు గంటల నిడివి ఉన్న పాతాళ్ లోక్ 2 ఆద్యంతం ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ ఆసక్తిగా నడిపించడంలో దర్శకులు అవినాష్ అరుణ్ – ప్రోసిత్ రాయ్ విజయం సాధించారు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత వయొలెన్స్, డెప్త్ సీజన్ 2 లో లేకపోవడం వీరాభిమానులకు నిరాశ కలిగించవచ్చు.
పైగా నాగాలాండ్ చుట్టే కథను మొత్తం నడిపించడం ల్యాగ్ కు దారి తీసింది. ఇంకొంచెం పట్టుగా నడిచి ఉంటే బెస్ట్ అయ్యేది కానీ అలాని తీవ్రంగా నిరాశపరిచేలా లేదు. సరిపడా టైం ఉంటే ఓ లుక్ వేయొచ్చు కానీ డోంట్ మిస్ క్యాటగిరని మాత్రం చెప్పలేం.
This post was last modified on January 21, 2025 3:28 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…