కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో మీరే చూడండి. గత ఏడాది అక్టోబర్ లో బెంగళూరు దగ్గర్లోని పీన్య ప్రాంతంలో టాక్సిక్ షూటింగ్ జరుగుతోంది. దీని కోసం వేలాది చెట్లు నరికివేశారనే ఫిర్యాదు మీద అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నారు.
వచ్చిన కంప్లయింట్ నిజమేనని నిర్ధారించుకుని షాక్ తిన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా వందలాది ఎకరాలు చదును చేయడం వల్ల పచ్చదనం హరించుకుపోయిందనేది టాక్సిక్ మీద వచ్చిన ప్రధాన వివాదం.
తాజాగా నిర్మాతలకు ప్రభుత్వం తరఫున నోటీస్ వెళ్ళింది. హిందుస్థాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు ఈ అటవీ ప్రాంతం కట్టబెట్టారనే దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాబినెట్ ఆమోదం లేకుండా డీనోటిఫికేషన్ అప్రూవల్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన ఈ కాంట్రావర్సి అంత సులభంగా ముగిసేలా లేదు.
సదరు కంపెనీ తమ పరిధిలో లేని ప్రాంతాన్ని కూడా షూటింగుల అద్దెకు ఇవ్వడం వల్లే ఈ అనర్థం జరిగిందని స్థానికుల ఆరోపణ. గత నాలుగైదు నెలలుగా దీన్ని ఫాలో అప్ చేస్తున్న అధికారులు ఎట్టకేలకు నోటీసులు ఇవ్వడం ద్వారా షూటింగ్ ఆపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే చాలా ఆలస్యంగా మొదలైన టాక్సిక్ కి డిసెంబర్ విడుదలను టార్గెట్ చేసుకున్నారు కానీ ఇలాంటి అడ్డంకులు చూస్తుంటే టైంకి రిలీజ్ చేయడం అనుమానంగానే ఉంది. ఇటీవలే వచ్చిన టీజర్ కు నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఎలివేషన్ కన్నా రొమాన్స్ ఎక్కువయిందనే కామెంట్స్ వినిపించాయి.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ లో కియారా అద్వానీ హీరోయిన్ కాగా మరో ప్రధాన పాత్రలో నయనతార ఉన్నది లేనిది టీమ్ అఫీషియల్ గా చెప్పడం లేదు. యష్ కు మాత్రం ఈ సినిమా మీద చాలా ఆశలున్నాయి. బడ్జెట్ మూడు వందల కోట్లకు పైమాటేనని బెంగళూరు టాక్.
This post was last modified on January 21, 2025 10:50 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…