మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు కొనసాగిస్తున్నారు. మంచు కుటుంబంలో రేగుతున్న వివాదాలు ఇంటా బయటా ఇబ్బందికరంగా మారినప్పటికీ విష్ణు మాత్రం పబ్లిసిటీ విషయంలో గతంలో వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకుని దానికి అనుగుణంగానే మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు.
తాజాగా శివుడి రూపంలో వచ్చిన అక్షయ్ కుమార్ లుక్, ఇంతకు ముందు పార్వతిగా కాజల్ అగర్వాల్ పోస్టర్ రెండూ ట్రోలింగ్ బారిన పడకుండా డీసెంట్ అనిపించుకున్నాయి.
గతంలో మోహన్ లాల్, దేవరాజ్, మధుబాల, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్ తదితరులను పోస్టర్లలో రివీల్ చేసినప్పుడు అంత మద్దతు దక్కలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మెల్లగా మారుతోంది. అసలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. శివరాత్రి పండగ సందర్భంగా దాన్ని రివీల్ చేసే ఆలోచనలో కన్నప్ప టీమ్ ఉంది.
వీలైతే టీజర్ లేదా స్టిల్ వదులుతారు. రిలీజ్ ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి హడావిడి లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రభాస్ క్యామియో ఇరవై నిమిషాలకు పైగా ఉంటుందన్న లీక్ ఒక్కసారిగా కన్నప్ప మీద ఆసక్తిని పెంచుతోందన్నది నిజం.
ఏప్రిల్ లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కన్నప్ప మీద విష్ణు కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. ఎంత ఖర్చు పెట్టినా అంతకంతా వెనక్కు ఇచ్చే స్థాయిలో వస్తోందని ధీమాగా చెబుతున్నారు. ఆ మధ్య రచయిత బివిఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ చూశానని, ఎక్స్ ట్రాడినరిగా వచ్చిందని చెప్పిన మాటలు బజ్ పరంగా ఉపయోగపడేవే.
భారీ క్యాస్టింగ్ తో రూపొందుతున్న కన్నప్ప మీద చాలా మంది రైటర్లు పని చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భక్తి రసాత్మక చిత్రంలో శరత్ కుమార్, బ్రహ్మాజీ, ముఖేష్ ఋషి, ప్రభుదేవా, సాయికుమార్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ చాలా పెద్దదే ఉంది.
This post was last modified on January 20, 2025 6:57 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…