మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన చేశారు కానీ విపరీతమైన థియేటర్ల కొరత కారణంగా ఆ ఆలోచన మానుకున్నారు. అయితే కొత్త డేట్ కోసం మల్లగుల్లాలు పడిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా మార్చి 28 లాక్ చేస్తూ అధికారిక పోస్టర్ వదిలారు. ఇది చూశాక పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 అఫీషియల్ డేట్ అదే. నెలల క్రితమే ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ మొన్నో లిరికల్ సాంగ్ కూడా వదిలారు.
ఇప్పుడు హఠాత్తుగా రాబిన్ హుడ్ వస్తుందంటే పవన్ ఫ్యాన్స్ కు సందేహం రావడం సహజం.పైగా పవర్ స్టార్ వీరాభిమాని నితిన్ క్లాష్ కు ఏ మాత్రం సిద్ధపడడు. దీని వెనుకో ఆసక్తికరమైన టాక్ తెలిసింది. హరిహర వీరమల్లుని పంపిణిని మైత్రినే తీసుకుందట. కాకపోతే ఖచ్చితంగా మార్చి 28 రిలీజ్ చేయడం గురించి నిర్మాత ఏఎం రత్నం ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారట. దీంతో సేఫ్ సైడ్ కోసం వేరొకరు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చి 28 లాక్ చేశారని తెలిసింది. ఒకవేళ వీరమల్లు ఒరిజినల్ డేట్ కే కట్టుబడితే అప్పుడు రాబిన్ హుడ్ తిరిగి నిర్ణయం మార్చుకుంటుందని సమాచారం.
మొత్తానికి విడుదల తేదీల వ్యవహారం రాను రాను సస్పెన్స్ సినిమాలను మించిపోతోంది. ప్రొడ్యూసర్లు పోటీ తక్కువగా ఉన్న మంచి సీజన్ కోసం ముందుగా అలెర్ట్ అవ్వాల్సిన అవసరం పెరిగిపోతోంది. లేదంటే కాంపిటీషన్ లో డేట్లు మిస్సయిపోయి వసూళ్లు రిస్క్ లో పెట్టాల్సి ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీష్మ కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, లిరికల్ సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది.దీని సంగతి సరేకానీ శివరాత్రికి రావాలనుకున్న నితిన్ మరో సినిమా తమ్ముడు వేసవికి వెళ్లే సూచనలు పెరిగిపోతున్నాయి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…