Movie News

రాబిన్ హుడ్ ఆగమనం….వీరమల్లు అనుమానం

మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన చేశారు కానీ విపరీతమైన థియేటర్ల కొరత కారణంగా ఆ ఆలోచన మానుకున్నారు. అయితే కొత్త డేట్ కోసం మల్లగుల్లాలు పడిన మైత్రి మూవీ మేకర్స్ తాజాగా మార్చి 28 లాక్ చేస్తూ అధికారిక పోస్టర్ వదిలారు. ఇది చూశాక పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 అఫీషియల్ డేట్ అదే. నెలల క్రితమే ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్లు చేసుకుంటూ మొన్నో లిరికల్ సాంగ్ కూడా వదిలారు.

ఇప్పుడు హఠాత్తుగా రాబిన్ హుడ్ వస్తుందంటే పవన్ ఫ్యాన్స్ కు సందేహం రావడం సహజం.పైగా పవర్ స్టార్ వీరాభిమాని నితిన్ క్లాష్ కు ఏ మాత్రం సిద్ధపడడు. దీని వెనుకో ఆసక్తికరమైన టాక్ తెలిసింది. హరిహర వీరమల్లుని పంపిణిని మైత్రినే తీసుకుందట. కాకపోతే ఖచ్చితంగా మార్చి 28 రిలీజ్ చేయడం గురించి నిర్మాత ఏఎం రత్నం ఖచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారట. దీంతో సేఫ్ సైడ్ కోసం వేరొకరు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా మార్చి 28 లాక్ చేశారని తెలిసింది. ఒకవేళ వీరమల్లు ఒరిజినల్ డేట్ కే కట్టుబడితే అప్పుడు రాబిన్ హుడ్ తిరిగి నిర్ణయం మార్చుకుంటుందని సమాచారం.

మొత్తానికి విడుదల తేదీల వ్యవహారం రాను రాను సస్పెన్స్ సినిమాలను మించిపోతోంది. ప్రొడ్యూసర్లు పోటీ తక్కువగా ఉన్న మంచి సీజన్ కోసం ముందుగా అలెర్ట్ అవ్వాల్సిన అవసరం పెరిగిపోతోంది. లేదంటే కాంపిటీషన్ లో డేట్లు మిస్సయిపోయి వసూళ్లు రిస్క్ లో పెట్టాల్సి ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. భీష్మ కాంబినేషన్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, లిరికల్ సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది.దీని సంగతి సరేకానీ శివరాత్రికి రావాలనుకున్న నితిన్ మరో సినిమా తమ్ముడు వేసవికి వెళ్లే సూచనలు పెరిగిపోతున్నాయి.

Satya

Recent Posts

పవన్ చెప్పినా అధికారులు వినట్లేదా…?

మన దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అలసత్వం అంతకంతకూ పెరిగిపోతోంది. శాసన వ్యవస్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన కీలకమైన బాధ్యత…

15 minutes ago

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం

ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా…

25 minutes ago

ఇండియా కూటమి మీటింగ్‌కు విజయ్ దూరం.. కారణాలివే!

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి.…

1 hour ago

మేక‌పాటి ఫ్యామిలీలో ఆస్తుల ర‌చ్చ‌లో జగన్ పేరెందుకు?

నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటిక‌ల్ ఫ్యామిలీ మేక‌పాటి కుటుంబంలో ఆస్తుల ర‌చ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి ప‌లువురు నాయ‌కులు…

2 hours ago

తమన్ జేబులో ఎనిమిది సినిమాలు

ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…

3 hours ago

“2027లో కేసీఆర్ బస్సు యాత్ర”

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…

3 hours ago