ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013 సంక్రాంతి సందర్భంగా రిలీజ్కు రెడీ అయింది. కానీ కొన్ని సమస్యలు తలెత్తి ఆ ఏడాది విడుదల కాలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. ఎంతకీ ఈ సినిమాకు మోక్షం కలగలేదు. ఇక ఎఫ్పటికీ విడుదల కాదు అనుకున్న ఈ సినిమాను అనూహ్యంగా ఈ సంక్రాంతికి రేసులోకి వచ్చింది.
ఐతే పుష్కర కాలం కిందట రిలీజ్ కావాల్సిన సినిమా.. ఇప్పుడు వస్తోందంటే సాధారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ తమిళనాట మాత్రం ‘మద గజ రాజా’కు అనూహ్యంగా బజ్ క్రియేట్ అయింది. అయినా సరే.. పొంగల్కు చాలా సినిమాలు పోటీలో ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏమాత్రం నిలబడుతుందో అనుకున్నారు. కానీ ఈ సినిమా పోటీని తట్టుకుంది. ఒక కొత్త సినిమా తరహాలోనే వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది.
తొలి రెండు రోజుల్లో ‘మద గజ రాజా’ రూ.10 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. మూడో రోజు వసూళ్లు ఇంకా పెరిగాయి. రూ.6 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. ఇలాంటి పాత సినిమాకు తొలి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం అనూహ్యం. తమిళంలో సంక్రాంతికి అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. దీని వల్ల థియేటర్ల సమస్య తప్పలేదు.
‘మద గజ రాజా’కు ఉన్న టికెట్ల డిమాండుకు.. అందుబాటులో ఉన్న స్క్రీన్లు సరిపోవడం లేదని ట్రేడ్ వర్గాలు అంటుండడం విశేషం. స్క్రీన్లు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని యుఎస్లో రిలీజ్ చేయకపోవడం పట్ల అక్కడి ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అక్కడా సినిమాను అందుబాటులోకి తేవాలంటున్నారు.
విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా కథాకథనాలు రొటీన్ అయినప్పటికీ.. కామెడీకి, యాక్షన్ సన్నివేశాలకు, హీరోయిన్ల గ్లామర్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా కామెడీ వేషాలు వదిలేసి హీరో పాత్రలకు పరిమితం అయిన సంతానం.. ఇందులో తన మార్కు కామెడీతో అదరగొట్టడాడని అంటున్నారు. సంతానం కామెడీకి దూరం కావడం పెద్ద తప్పు అని ఈ చిత్రం రుజువు చేస్తోంది.
This post was last modified on January 15, 2025 3:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…