Movie News

మిడిల్ క్లాస్ దర్శకుడి వెరైటీ ప్రయోగం

క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత ఏడాది ఈటీవీ విన్ లో రిలీజైన వెబ్ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సగటు మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ముగ్గురు పిల్లలతో ఆ ఫ్యామిలీలో నడిపించిన డ్రామా దర్శకుడు ఆదిత్య హాసన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.

ముఖ్యంగా చిన్న కొడుగ్గా నటించిన రోహన్ రాయ్ పాత్ర ఓ రేంజులో బ్లాస్టయ్యింది. తనకు తండ్రిగా చేసిన శివాజీ మధ్య సన్నివేశాలు మాములుగా పేలలేదు. ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది.

అంటే చిచ్చర పిడుగు రోహన్ రాయ్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అయ్యాడు. అమ్మా నాన్నలకు జుట్టు కాస్త తెల్లబడి వాళ్లే ఉంటారు. కాకపోతే ఈసారి కుటుంబ కష్టాలు కాకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందట. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని ఆ కుర్రాడిని ప్రేమించే అమ్మడిగా చూడబోతున్నాం.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నారు. అనౌన్స్ మెంట్ టీజర్ వెరైటీగా కట్ చేయడం ఆకట్టుకునేలా ఉంది. ఖుషి, హాయ్ నాన్నతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ట్యాగ్ మాత్రం పెట్టారు.

మొత్తానికి ఈ వెరైటీ ప్రయోగం బాగుంది. ఓటిటి కంటెంట్ కి థియేటర్ కొనసాగింపు మంచి ఆలోచన. గతంలో మా ఊరి పొలిమేర సీక్వెల్ కి ఈ ఫార్ములా వాడి విజయం సాధించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు అదే తరహాలోనే ప్లాన్ చేసుకోవడం వర్కౌట్ అయ్యేలా ఉంది.

ఆనంద్, వైష్ణవి కాంబోలో గతంలో బేబీ నిర్మాతలు ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ తర్వాత అది వేరే హీరోకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదిత్య హాసన్ రాసుకున్న కథకు దానికి సంబంధం లేదు. ఏది ఏమైనా న్యూ జనరేషన్ డైరెక్టర్లు అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచించడం సృజనాత్మక కోణంలో చాలా అవసరం.

Kumar

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago