క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత ఏడాది ఈటీవీ విన్ లో రిలీజైన వెబ్ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సగటు మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తూ శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో ముగ్గురు పిల్లలతో ఆ ఫ్యామిలీలో నడిపించిన డ్రామా దర్శకుడు ఆదిత్య హాసన్ కు మంచి పేరు తీసుకొచ్చింది.
ముఖ్యంగా చిన్న కొడుగ్గా నటించిన రోహన్ రాయ్ పాత్ర ఓ రేంజులో బ్లాస్టయ్యింది. తనకు తండ్రిగా చేసిన శివాజీ మధ్య సన్నివేశాలు మాములుగా పేలలేదు. ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది.
అంటే చిచ్చర పిడుగు రోహన్ రాయ్ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ అయ్యాడు. అమ్మా నాన్నలకు జుట్టు కాస్త తెల్లబడి వాళ్లే ఉంటారు. కాకపోతే ఈసారి కుటుంబ కష్టాలు కాకుండా ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందట. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యని ఆ కుర్రాడిని ప్రేమించే అమ్మడిగా చూడబోతున్నాం.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ దీన్ని నిర్మించబోతున్నారు. అనౌన్స్ మెంట్ టీజర్ వెరైటీగా కట్ చేయడం ఆకట్టుకునేలా ఉంది. ఖుషి, హాయ్ నాన్నతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. ట్యాగ్ మాత్రం పెట్టారు.
మొత్తానికి ఈ వెరైటీ ప్రయోగం బాగుంది. ఓటిటి కంటెంట్ కి థియేటర్ కొనసాగింపు మంచి ఆలోచన. గతంలో మా ఊరి పొలిమేర సీక్వెల్ కి ఈ ఫార్ములా వాడి విజయం సాధించిన సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ దర్శకుడు అదే తరహాలోనే ప్లాన్ చేసుకోవడం వర్కౌట్ అయ్యేలా ఉంది.
ఆనంద్, వైష్ణవి కాంబోలో గతంలో బేబీ నిర్మాతలు ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ తర్వాత అది వేరే హీరోకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదిత్య హాసన్ రాసుకున్న కథకు దానికి సంబంధం లేదు. ఏది ఏమైనా న్యూ జనరేషన్ డైరెక్టర్లు అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచించడం సృజనాత్మక కోణంలో చాలా అవసరం.
This post was last modified on January 15, 2025 12:08 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…