తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఆదివారం సాయంత్రానికే చంద్రగిరి చేరుకోగా… లోకేశ్ కుమారుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏటా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు చంద్రగిరి పరిధిలోని తన సొంతూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నందమూరి ఫ్యామిలీలోని చాలా మంది ప్రముఖులు సంక్రాంతి వేడుకల కోసం చంద్రగిరికి వచ్చారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సోదరి తేజస్విని తన భర్త, విశాఖ ఎంపీ భరత్ తో కలిసి నారావారిపల్లె చేరుకున్నారు. వెరసి నారావారిపల్లెతో పాటుగా చంద్రగిరి పరిసరాలన్నీ సంబరాలతో హోరెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే… ఈ సంక్రాంతికి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమా విజయంతో సంక్రాంతి వేడుకలను ఓ రేంజిలో జరుపుకుంటూ ఉండగా…బాలయ్య సినిమాను లోకేష్ ప్రత్యేకంగా తిలకించారు. ఇందుకోసం లోకేష్ స్వయంగా సినిమా థియేటర్ కు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమాను వీక్షించేందుకు లోకేష్ కుటుంబంతో కలిసి థియేటర్ కు కదలివెళ్లారు. లోకేశ్ బ్రహ్మణి దంపతుల వెంట ఎంపీ శ్రీభరత్ దంపతులు, బాలయ్య సోదరుడు రామకృష్ణ, నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు దగ్గరి బంధువులు చాలా మందే బాలయ్య సినిమాను చూసేందుకు వెల్లారు.
పల్లెల్లో ఉండే సినిమా హాళ్లల్లో మాదిరిగా… లోకేష్ బృందంలో మగాళ్లంతా ఒక దరిన కూర్చోగా… ఆడవాళ్లంతా మరో చోట కూర్చుని సినిమాను ఎంజాయ్ చేశారు.
This post was last modified on January 13, 2025 5:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…