తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఆదివారం సాయంత్రానికే చంద్రగిరి చేరుకోగా… లోకేశ్ కుమారుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏటా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు చంద్రగిరి పరిధిలోని తన సొంతూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నందమూరి ఫ్యామిలీలోని చాలా మంది ప్రముఖులు సంక్రాంతి వేడుకల కోసం చంద్రగిరికి వచ్చారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సోదరి తేజస్విని తన భర్త, విశాఖ ఎంపీ భరత్ తో కలిసి నారావారిపల్లె చేరుకున్నారు. వెరసి నారావారిపల్లెతో పాటుగా చంద్రగిరి పరిసరాలన్నీ సంబరాలతో హోరెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే… ఈ సంక్రాంతికి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమా విజయంతో సంక్రాంతి వేడుకలను ఓ రేంజిలో జరుపుకుంటూ ఉండగా…బాలయ్య సినిమాను లోకేష్ ప్రత్యేకంగా తిలకించారు. ఇందుకోసం లోకేష్ స్వయంగా సినిమా థియేటర్ కు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమాను వీక్షించేందుకు లోకేష్ కుటుంబంతో కలిసి థియేటర్ కు కదలివెళ్లారు. లోకేశ్ బ్రహ్మణి దంపతుల వెంట ఎంపీ శ్రీభరత్ దంపతులు, బాలయ్య సోదరుడు రామకృష్ణ, నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు దగ్గరి బంధువులు చాలా మందే బాలయ్య సినిమాను చూసేందుకు వెల్లారు.
పల్లెల్లో ఉండే సినిమా హాళ్లల్లో మాదిరిగా… లోకేష్ బృందంలో మగాళ్లంతా ఒక దరిన కూర్చోగా… ఆడవాళ్లంతా మరో చోట కూర్చుని సినిమాను ఎంజాయ్ చేశారు.
This post was last modified on January 13, 2025 5:29 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…