తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఆదివారం సాయంత్రానికే చంద్రగిరి చేరుకోగా… లోకేశ్ కుమారుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏటా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు చంద్రగిరి పరిధిలోని తన సొంతూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నందమూరి ఫ్యామిలీలోని చాలా మంది ప్రముఖులు సంక్రాంతి వేడుకల కోసం చంద్రగిరికి వచ్చారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సోదరి తేజస్విని తన భర్త, విశాఖ ఎంపీ భరత్ తో కలిసి నారావారిపల్లె చేరుకున్నారు. వెరసి నారావారిపల్లెతో పాటుగా చంద్రగిరి పరిసరాలన్నీ సంబరాలతో హోరెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే… ఈ సంక్రాంతికి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమా విజయంతో సంక్రాంతి వేడుకలను ఓ రేంజిలో జరుపుకుంటూ ఉండగా…బాలయ్య సినిమాను లోకేష్ ప్రత్యేకంగా తిలకించారు. ఇందుకోసం లోకేష్ స్వయంగా సినిమా థియేటర్ కు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమాను వీక్షించేందుకు లోకేష్ కుటుంబంతో కలిసి థియేటర్ కు కదలివెళ్లారు. లోకేశ్ బ్రహ్మణి దంపతుల వెంట ఎంపీ శ్రీభరత్ దంపతులు, బాలయ్య సోదరుడు రామకృష్ణ, నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు దగ్గరి బంధువులు చాలా మందే బాలయ్య సినిమాను చూసేందుకు వెల్లారు.
పల్లెల్లో ఉండే సినిమా హాళ్లల్లో మాదిరిగా… లోకేష్ బృందంలో మగాళ్లంతా ఒక దరిన కూర్చోగా… ఆడవాళ్లంతా మరో చోట కూర్చుని సినిమాను ఎంజాయ్ చేశారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…