తెలుగు నేల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సమేతంగా తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా ఆదివారం సాయంత్రానికే చంద్రగిరి చేరుకోగా… లోకేశ్ కుమారుడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఏటా సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబు చంద్రగిరి పరిధిలోని తన సొంతూరుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నందమూరి ఫ్యామిలీలోని చాలా మంది ప్రముఖులు సంక్రాంతి వేడుకల కోసం చంద్రగిరికి వచ్చారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి సోదరి తేజస్విని తన భర్త, విశాఖ ఎంపీ భరత్ తో కలిసి నారావారిపల్లె చేరుకున్నారు. వెరసి నారావారిపల్లెతో పాటుగా చంద్రగిరి పరిసరాలన్నీ సంబరాలతో హోరెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే… ఈ సంక్రాంతికి హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ విడుదలై విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఈ సినిమా విజయంతో సంక్రాంతి వేడుకలను ఓ రేంజిలో జరుపుకుంటూ ఉండగా…బాలయ్య సినిమాను లోకేష్ ప్రత్యేకంగా తిలకించారు. ఇందుకోసం లోకేష్ స్వయంగా సినిమా థియేటర్ కు వెళ్లడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్ లో డాకు మహారాజ్ సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ సినిమాను వీక్షించేందుకు లోకేష్ కుటుంబంతో కలిసి థియేటర్ కు కదలివెళ్లారు. లోకేశ్ బ్రహ్మణి దంపతుల వెంట ఎంపీ శ్రీభరత్ దంపతులు, బాలయ్య సోదరుడు రామకృష్ణ, నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు దగ్గరి బంధువులు చాలా మందే బాలయ్య సినిమాను చూసేందుకు వెల్లారు.
పల్లెల్లో ఉండే సినిమా హాళ్లల్లో మాదిరిగా… లోకేష్ బృందంలో మగాళ్లంతా ఒక దరిన కూర్చోగా… ఆడవాళ్లంతా మరో చోట కూర్చుని సినిమాను ఎంజాయ్ చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…