ఒకప్పుడు హిందీలో తెలుగు హీరోల డబ్బింగులు రిలీజ్ చేయాలంటే పెద్ద రిస్క్. కనీస ఆదరణ దక్కుతుందో లేదోననే అనుమానం నిర్మాతలకు వెనక్కు లాగేది. సీనియర్ హీరోలు బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ చేసి హిట్లు కొట్టినా అవి మరీ పెద్ద రేంజ్ కు చేరుకోలేకపోయాయి. కానీ బాహుబలి నుంచి పుష్ప దాకా సీన్ మొత్తం మారిపోయింది.
ఎంతగా అంటే ఉత్తరాది రాష్ట్రాల థియేటర్లు, మల్టీప్లెక్సులు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకు మన సౌత్ డబ్బింగ్ లే ప్రాణవాయువయ్యేంత. ఒకరకంగా చెప్పాలంటే ఆపద్బాంధవుడి పాత్రను పోషిస్తున్నట్టే. అదెలాగో 2024 ఆర్ మ్యాక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది.
ఇండియాలో గత ఏడాది మొత్తం అన్ని బాషల బాక్సాఫీస్ గ్రాస్ 12 వేల కోట్లు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 167 కోట్లు ఎక్కువ. కేవలం హిందీనే పరిగణనలోకి తీసుకుంటే 4679 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అందులో 31 శాతం డబ్బింగ్ సినిమాలే. ఒక్క పుష్ప 2 ది రూల్ హిందీ వెర్షనే 889 కోట్లు ఇచ్చింది.
స్ట్రెయిట్ సినిమాలనే పరిగణనలోకి తీసుకుంటే బాలీవుడ్ మొత్తం గ్రాస్ 37 శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భులయ్యా 2 లాంటి దెయ్యాల చిత్రాలు ఆదుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదనే మాట వాస్తవం.
తెలుగు చూసుకుంటే స్థిరంగా 15 నుంచి 20 శాతం ఎదుగుదల ఉండటం విశేషం. కల్కి 2898 ఏడి, దేవర, పుష్ప 2 లాంటివి ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కావడం దీనికి దోహదం చేసింది. ఇప్పుడీ 2025లోనూ హిందీ మార్కెట్ సౌత్ మీదే ఆశలు పెట్టుకుంది.
హరిహర వీరమల్లు, విశ్వంభర. కోహినూర్, ది రాజా సాబ్, ఫౌజీ లాంటివి మన స్థాయిని మరింత పైకి తీసుకెళ్ళబోతున్నాయి. ఇక్కడ మిక్స్డ్ టాక్ తో పోరాడుతున్న గేమ్ ఛేంజర్ హిందీలో మంచి వసూళ్లతో రన్ కావడం మన సినిమాలకు వాళ్ళెంత కనెక్ట్ అవుతున్నారో చెప్పేందుకు సరిపోయే ఉదాహరణ. క్రికెట్ కి ఐసిసి లాగా భారతీయ సినిమాకు టాలీవుడ్ అవుతుందేమో.
This post was last modified on January 13, 2025 2:10 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…