నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మినిమం ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు కథ పరంగా ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. కథానాయికలను గ్లామర్ డాల్స్గానే చూపిస్తుంటారు. ఐతే బాలయ్య కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’లో ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో వాళ్లు ఏ స్థాయిలో గ్లామర్ విందు చేస్తారా అని ఎదురు చూశారు అభిమానులు. ఐతే దర్శకుడు బాబీ ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు.
గ్లామర్ తారగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా జైశ్వాల్ను ఆ కోణంలో అస్సలు చూపించలేదు. ఇందులో ఆమెకు ఉన్నవి తక్కువ సన్నివేశాలే అయినా.. పెర్ఫామెన్స్కు స్కోప్ ఉన్నవే. అందులో ఆమె రాణించింది. బాలయ్యకు భార్యగా కనిపించిన ప్రగ్యాతో ఒక డ్యూయెట్ అయినా ఉంటుందేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ బాబీ అలాంటి ప్రయత్నమే చేయలేదు.
ఇక ఎక్కువగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ అవసరమైనపుడు గ్లామర్ యాంగిల్ కూడా చూపించే శ్రద్ధా శ్రీనాథ్ను కూడా పూర్తిగా ట్రెడిషనల్ రోల్లోనే చూపించాడు బాబీ. అసలు అందరూ అనుకున్నట్లు ఆమె సినిమాలో రెండో హీరోయిన్ కాదు. బాలయ్యకు జోడీగా నటించలేదామె. ఆమె ఎవరి సరసన నటించింది, బాలయ్యకు ఏమవుతుంది అన్నది ట్విస్ట్. అదేంటో సినిమాలోనే చూడాలి.
ఆమె పాత్ర చివరికి టర్న్ తీసుకునే తీరు చూశాక ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. బాబీ లాంటి మాస్ డైరెక్టర్ ఇద్దరు మెయిన్ హీరోయిన్లను గ్లామర్ కోసం, పాటల కోసం వాడకుంటే ఇద్దరికీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇక ఊర్వశి రౌటెలా విషయానికి వస్తే ఆమె జస్ట్ ఐటెం సాంగ్కు పరిమితం కాలేదు. ఆమెకు ఇందులో ఒక పాత్ర ఉంది. ప్రథమార్ధమంతా ఆమె పాత్ర కనిపిస్తుంది. సన్నివేశాల్లోనే కాక.. దబిడి దిబిడి పాటలోనూ ఆమె బాగానే అందాలు ఆరబోసింది.
This post was last modified on January 13, 2025 11:16 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…