ఎప్పుడూ చాలా హుషారుగా కనిపించే తమిళ హీరో విశాల్.. వారం కిందట తన సినిమా ‘మదగజరాజా’ ప్రమోషనల్ ఈవెంట్లో కనిపించిన తీరు చూసి అందరూ షాకైపోయారు. ఎన్నడూ లేని విధంగా బాగా సన్నబడిపోయిన విశాల్.. చేతితో మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. చెయ్యి అంతగా వణుకుతూ కనిపించింది. తన ముఖంలో కూడా మార్పు కనిపించింది.
ఉన్నట్లుండి వయసు మీద పడ్డ సంకేతాలు కనిపించాయి. మొత్తంగా తన ఆరోగ్య పరిస్థితి పట్ల అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. విశాల్ హై ఫీవర్తో బాధ పడుతున్నట్లుగా కొందరు పోస్టులు పెట్టారు. అతడికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సైతం ఇదే తీరులో పత్రికా ప్రకటన ఇచ్చింది. ఐతే కేవలం తీవ్ర స్థాయిలో జ్వరం ఉన్నంత మాత్రాన మనిషి ఇలా అయిపోతాడా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
విశాల్ తీవ్ర ఆరోగ్య సమస్యతోనే బాధ పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమస్య ఏదైనప్పటికీ విశాల్ త్వరగా మామూలు మనిషి కావాలని అందరూ కోరుకున్నారు. అభిమానులు తన విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐతే వారి ఆందోళనకు తెరదించుతూ.. విశాల్ తాజాగా మామూలు మనిషై కనిపించాడు. ‘మదగజరాజా’ ప్రిమిర్ షో కోసం వచ్చిన విశాల్ను చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంకా కొంచెం డల్నెస్ ఉంది కానీ.. గత వారం కనిపించినట్లయితే లేడు. ఈసారి అతడి మాట తడబడలేదు. మైక్ పట్టుకున్నపుడు అతడి చేతులు వణకలేదు. తన ఆరోగ్యం గురించి అతను పరోక్షంగా స్పందించాడు. ‘‘ఇప్పుడు నా చేతులు వణకట్లేదు. మైక్ కూడా సరిగా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మరిచిపోలేరు.
ఎంతోమంది గెట్ వెల్ సూన్ అని, కమ్ బ్యాక్ అని సందేశాలు పెట్టారు. వాటి వల్లే నేను కోలుకున్నా. మా నాన్న వల్లే నేను ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతున్నా. నేను గ్యాప్ లేకుండా ఆరు నెలలకు ఒక సినిమా చేసుకుని వెళ్లిపోతున్నానని.. విశ్రాంతి అవసరమని కొందరు సూచించారు. ప్రస్తుతానికి నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది’’ అని విశాల్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on January 13, 2025 10:56 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…