కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 69వ సినిమా భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం రెండు నెలలుగా జరుగుతూనే ఉంది. కానీ దాన్ని ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరూ ఎస్ అనలేని పరిస్థితి. తమిళ వెర్షన్ దర్శకుడు హెచ్ వినోత్ కూడా దాన్ని ఖండిస్తూ ఇటీవలే ఒక ఈవెంట్ లో మాట్లాడ్డంతో ఫ్యాన్స్ అనుమానం తీరిందనే అనుకున్నారు.
కానీ ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం మ్యూజికల్ ఫెస్ట్ వేడుకలో మరోసారి ఈ టాపిక్ పెద్ద చర్చకే దారి తీసేలా కనిపించింది. ఇందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు విటీవీ గణేష్ చిన్నగా మాట్లాడుతూ పెద్ద బాంబు పేల్చారు.
అనిల్ రావిపూడిని మెచ్చుకోవడంలో భాగంగా పాత సంఘటన గుర్తు చేసుకుని విజయ్ భగవంత్ కేసరిని అయిదు సార్లు చూశాడని, వెంటనే అనిల్ రావిపూడిని పిలిపించి రీమేక్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించి వచ్చాడని, అంతగా బాగా నచ్చేలా తీశాడని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించారు.
మధ్యలో రావిపూడి ఎంతగా ఆయనకు సర్దిచెప్పి టాపిక్ డైవర్ట్ చేద్దామని చూసినా గణేష్ వినలేదు. ఆఖరికి యాంకర్ సుమ సైతం ఆపేయాలనే రీతిలో సంజ్ఞలు చేసినా లాభం లేకపోయింది. ఈ విషయం చెప్పే తీరాలని కంకణం కట్టుకున్న విటివి గణేష్ తాను అనుకున్నది పూర్తి చేసేదాకా వదలకపోవడం కొసమెరుపు.
అక్కడే ఉన్న అనిల్ రావిపూడి క్లారిటీ ఇస్తూ కలిసిన మాట వాస్తవమే కానీ అది వేరే విషయం గురించని, వాళ్ళుగా అనౌన్స్ చేసే దాకా దీని గురించి కామెంట్ చేయడం భావ్యం కాదని క్లారిటీ ఇచ్చాడు. తాను కలిసిన హీరోల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరో విజయ్ అని చెబుతూ ముగించేశాడు.
ఏది ఏమైనా గణేష్ ప్రసంగించిన అయిదారు నిముషాలు టెన్షన్ తో స్టేజి అలా ఊగిపోయింది. దెబ్బకు ఈ వీడియో ఇప్పుడు తమిళ ట్విట్టర్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం మొదలయ్యింది. ఈ పరిణామంతో విజయ్ 69 దర్శక నిర్మాతలు ఔననో కాదనో ఏదో ఒకటి అధికారికంగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…