గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ఎడిటింగ్ లో తీసేసి ఉండొచ్చు కానీ పొటెన్షియాలిటీ ఉన్న ఇలాంటి నటులను వాడుకోకపోవడం పొరపాటు కంటే తప్పే అవుతుంది.
ఎందుకంటే ప్రియదర్శి చిన్నా చితక క్యాస్టింగ్ కాదు. సోలో హీరోగా సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేస్తున్నాడు. బలగం తర్వాత తన మార్కెట్ పెరిగింది. డార్లింగ్ తీసింది హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మాతలు.
ప్రియదర్శి ఒక్కడే కాదు సీనియర్ నరేష్ ని సైతం కేవలం ఒక్క సన్నివేశానికి పరిమితం చేశాడు. రామ్ చరణ్ ఇంటికి వచ్చాక భోజనం దగ్గర రెండు ముక్కలు మాట్లాడ్డం తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించడు. అప్పన్న కొడుకైన రామ్ నందన్ ఇతని దగ్గరికి ఎలా వచ్చాడనే దాన్ని సరిగ్గా జస్టిఫై చేయలేదు.
కమెడియన్ సత్య, వైవా హర్షలకు సైతం ఇదే ట్రీట్మెంట్. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రియదర్శి చరణ్ తో కలిసి పని చేయడం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. తీరా చూస్తే ఎవరో చెబితే తప్ప నిజంగా ఉన్నాడని గుర్తించలేనంత నిర్లక్షమైన స్పేస్ దొరికింది.
ఇలా సినిమా మొత్తం మొక్కుబడిగా ఉన్న వాళ్ళలో థర్టీ ఇయర్స్ పృథ్వి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. వీళ్ళందరూ తక్కువ రెమ్యునరేషన్ కు వచ్చే టైపు కాదు. డిమాండ్ ఉన్నోళ్లు. రెగ్యులర్ పారితోషికమే ఇచ్చి తీసుకుని ఉంటారు.
ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చరణ్, ఎస్జె సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం తప్ప ఇంకెవరూ కనిపించనంతగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇది రాంగని చెప్పలేం కానీ తారాగణాన్ని సరైన రీతిలో వాడుకోకపోవడం ముమ్మాటికీ కాస్ట్లీ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. శంకర్ లాంటి అనుభవజ్ఞులు ఈ పాయింట్ ఎలా మిస్సయ్యారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 11, 2025 8:19 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…