గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ఎడిటింగ్ లో తీసేసి ఉండొచ్చు కానీ పొటెన్షియాలిటీ ఉన్న ఇలాంటి నటులను వాడుకోకపోవడం పొరపాటు కంటే తప్పే అవుతుంది.
ఎందుకంటే ప్రియదర్శి చిన్నా చితక క్యాస్టింగ్ కాదు. సోలో హీరోగా సారంగపాణి జాతకం లాంటి సినిమాలు చేస్తున్నాడు. బలగం తర్వాత తన మార్కెట్ పెరిగింది. డార్లింగ్ తీసింది హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ నిర్మాతలు.
ప్రియదర్శి ఒక్కడే కాదు సీనియర్ నరేష్ ని సైతం కేవలం ఒక్క సన్నివేశానికి పరిమితం చేశాడు. రామ్ చరణ్ ఇంటికి వచ్చాక భోజనం దగ్గర రెండు ముక్కలు మాట్లాడ్డం తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించడు. అప్పన్న కొడుకైన రామ్ నందన్ ఇతని దగ్గరికి ఎలా వచ్చాడనే దాన్ని సరిగ్గా జస్టిఫై చేయలేదు.
కమెడియన్ సత్య, వైవా హర్షలకు సైతం ఇదే ట్రీట్మెంట్. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రియదర్శి చరణ్ తో కలిసి పని చేయడం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనకు ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. తీరా చూస్తే ఎవరో చెబితే తప్ప నిజంగా ఉన్నాడని గుర్తించలేనంత నిర్లక్షమైన స్పేస్ దొరికింది.
ఇలా సినిమా మొత్తం మొక్కుబడిగా ఉన్న వాళ్ళలో థర్టీ ఇయర్స్ పృథ్వి, రఘుబాబు, శుభలేఖ సుధాకర్ లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. వీళ్ళందరూ తక్కువ రెమ్యునరేషన్ కు వచ్చే టైపు కాదు. డిమాండ్ ఉన్నోళ్లు. రెగ్యులర్ పారితోషికమే ఇచ్చి తీసుకుని ఉంటారు.
ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చరణ్, ఎస్జె సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం తప్ప ఇంకెవరూ కనిపించనంతగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇది రాంగని చెప్పలేం కానీ తారాగణాన్ని సరైన రీతిలో వాడుకోకపోవడం ముమ్మాటికీ కాస్ట్లీ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. శంకర్ లాంటి అనుభవజ్ఞులు ఈ పాయింట్ ఎలా మిస్సయ్యారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 11, 2025 8:19 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…