టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం పుష్ప 2 సినిమా భారీ హిట్ గా నిలిచి… భారత చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. అయినా కూడా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తన అభిమాని ఒకరు చనిపోవడం, దానిపై కేసులు నమోదు కావడం, ఏకంగా తాను ఓ రాత్రంతా జైలులో గడపాల్సి రావడం, తెలంగాణ సర్కారుతో అనవసరంగా రేగిన వివాదం… ఇలా అన్నీ ఒకే సారి మీద పడటంతో సక్సెస్ ఫీల్ అతడు అనుభవించలేకపోతున్నాడు. ఏదో కోల్పోయిన వాడిలా ఇంటి ఆవరణలో ఒక్కడూ కూర్చుని కుమిలిపోతున్న అతడికి శనివారం నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
ఇప్పటికే బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు..ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఓ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా అతడికి ఓ కండీషన్ పెట్టింది. ఈ క్రమంలో అడుగు బయటపెట్టలేని పరిస్థితిని పంటి బిగువుననే భరిస్తూ వస్తున్న బన్నీ… గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చారు. రేపు ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో అతడికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
బన్నీకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతులను సడలిస్తూ నాంపల్లి కోర్టు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. అంతేకాకుండా… విదేశాలకు వెళ్లకుండా బన్నీకి విధించిన షరతును కూడా ఎత్తివేస్తూ… విదేశాలకు వెళ్లాలనుకున్నా వెళ్లొచ్చంటూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవసరం లేకుండా… ఇటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించడంతో బన్నీకి భారీ ఊరట లభించిందని చెప్పక తప్పదు.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…