టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం పుష్ప 2 సినిమా భారీ హిట్ గా నిలిచి… భారత చలన చిత్ర రికార్డులను తిరగరాస్తోంది. అయినా కూడా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తన అభిమాని ఒకరు చనిపోవడం, దానిపై కేసులు నమోదు కావడం, ఏకంగా తాను ఓ రాత్రంతా జైలులో గడపాల్సి రావడం, తెలంగాణ సర్కారుతో అనవసరంగా రేగిన వివాదం… ఇలా అన్నీ ఒకే సారి మీద పడటంతో సక్సెస్ ఫీల్ అతడు అనుభవించలేకపోతున్నాడు. ఏదో కోల్పోయిన వాడిలా ఇంటి ఆవరణలో ఒక్కడూ కూర్చుని కుమిలిపోతున్న అతడికి శనివారం నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
ఇప్పటికే బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు..ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఓ నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా అతడికి ఓ కండీషన్ పెట్టింది. ఈ క్రమంలో అడుగు బయటపెట్టలేని పరిస్థితిని పంటి బిగువుననే భరిస్తూ వస్తున్న బన్నీ… గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చారు. రేపు ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో అతడికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
బన్నీకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా పెట్టిన షరతులను సడలిస్తూ నాంపల్లి కోర్టు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. అంతేకాకుండా… విదేశాలకు వెళ్లకుండా బన్నీకి విధించిన షరతును కూడా ఎత్తివేస్తూ… విదేశాలకు వెళ్లాలనుకున్నా వెళ్లొచ్చంటూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. అటు పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవసరం లేకుండా… ఇటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించడంతో బన్నీకి భారీ ఊరట లభించిందని చెప్పక తప్పదు.
This post was last modified on January 11, 2025 1:53 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…