నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో అభిమానులు, బయ్యర్లున్నారు. ఇవాళ నిర్మాణ సంస్థ ఎస్విసి అధికారికంగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 186 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దేవర కంటే ఫస్ట్ డే పది కోట్ల కంటే ఎక్కువ రావడం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద నుంచి నూటా పాతిక కోట్ల దాకా వచ్చే అవకాశం ఉండగా మరీ ఇంతగా జోడించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఎంత పెద్ద సినిమాకైనా ఇంతే కలెక్షన్లు వచ్చాయని చెప్పేందుకు ఎలాంటి అఫీషియల్ సోర్స్ లేదు. డిస్ట్రిబ్యూటర్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ట్రాకర్స్ తమ దగ్గరున్న సమాచారాన్ని క్రోడీకరించి నెంబర్లు పెడుతుంటారు. ఎక్కువో తక్కువో వీటితో దగ్గరగా మ్యాచ్ అయ్యేలా ప్రొడక్షన్ ఆఫీస్ పోస్టర్లు వస్తాయి. కానీ గేమ్ ఛేంజర్ కు అలా జరగలేదన్నది డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. నిజా నిజాలు నిర్ధారించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎస్విసి చెప్పిన 186 కోట్ల నెంబరే చెలామణిలోకి వస్తుంది. దీని సంగతి ఎలా ఉన్నా ఉత్తరాది బుకింగ్స్ ఊపందుకున్న ట్రెండ్ కనిపిస్తోంది.
ఇప్పుడు దీని గురించే ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ స్పందన మరీ అన్యాయంగా లేకపోయినా డిజాస్టర్ తరహాలో ప్రొజెక్ట్ అవుతున్న విధానాన్ని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పడం లేదని కానీ ఇలా కొందరు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ క్యాంపైన్ చేయడం గురించి అడుగుతున్నారు. ఇది దేవర, పుష్ప 2, కల్కి, గుంటూరు కారం లాంటి వాటికి కూడా జరిగింది కానీ గేమ్ ఛేంజర్ కు కాస్త ఎక్కువ మోతాదు అయ్యిందనేది వాళ్ళ వెర్షన్. ఏది ఎలా ఉన్నా ఒకవేళ సక్సెస్ మీట్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడే ఓపెనింగ్ గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి.
This post was last modified on January 11, 2025 12:20 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…