నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో అభిమానులు, బయ్యర్లున్నారు. ఇవాళ నిర్మాణ సంస్థ ఎస్విసి అధికారికంగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 186 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దేవర కంటే ఫస్ట్ డే పది కోట్ల కంటే ఎక్కువ రావడం నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంద నుంచి నూటా పాతిక కోట్ల దాకా వచ్చే అవకాశం ఉండగా మరీ ఇంతగా జోడించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఎంత పెద్ద సినిమాకైనా ఇంతే కలెక్షన్లు వచ్చాయని చెప్పేందుకు ఎలాంటి అఫీషియల్ సోర్స్ లేదు. డిస్ట్రిబ్యూటర్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ట్రాకర్స్ తమ దగ్గరున్న సమాచారాన్ని క్రోడీకరించి నెంబర్లు పెడుతుంటారు. ఎక్కువో తక్కువో వీటితో దగ్గరగా మ్యాచ్ అయ్యేలా ప్రొడక్షన్ ఆఫీస్ పోస్టర్లు వస్తాయి. కానీ గేమ్ ఛేంజర్ కు అలా జరగలేదన్నది డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. నిజా నిజాలు నిర్ధారించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎస్విసి చెప్పిన 186 కోట్ల నెంబరే చెలామణిలోకి వస్తుంది. దీని సంగతి ఎలా ఉన్నా ఉత్తరాది బుకింగ్స్ ఊపందుకున్న ట్రెండ్ కనిపిస్తోంది.
ఇప్పుడు దీని గురించే ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ స్పందన మరీ అన్యాయంగా లేకపోయినా డిజాస్టర్ తరహాలో ప్రొజెక్ట్ అవుతున్న విధానాన్ని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పడం లేదని కానీ ఇలా కొందరు ఉద్దేశపూర్వకంగా నెగటివ్ క్యాంపైన్ చేయడం గురించి అడుగుతున్నారు. ఇది దేవర, పుష్ప 2, కల్కి, గుంటూరు కారం లాంటి వాటికి కూడా జరిగింది కానీ గేమ్ ఛేంజర్ కు కాస్త ఎక్కువ మోతాదు అయ్యిందనేది వాళ్ళ వెర్షన్. ఏది ఎలా ఉన్నా ఒకవేళ సక్సెస్ మీట్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడే ఓపెనింగ్ గురించి ఏమైనా చెబుతారేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…