Movie News

ఆరో ‘ఆట’ రద్దు.. ఏపీలో ఇకపై 5 ‘ఆట’లే

ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని సినిమాలను రోజుకు ఆరు షోల మేర ప్రదర్శించుకునే వెసులుబాటు ఉండేది. వీటిలో రెండు షోలను బెనిఫిట్ షోలుగా మలచుకుని నిర్మాతలు ఓ మోస్తరు గట్టెక్కేవారు. అయితే ఇకపై ఏపీలో ఆరు షోలకు అనుమతి లేదు. రోజుకు ఐదు ఫోలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన తొలి 10 రోజులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ తర్వాత యథాప్రకారం రోజుకు 4 షోలకే అవకాశం ఉంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కూటమి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం… ఈ సంక్రాంతికి విడుదల అయిన, విడుదల కానున్న చిత్రాలపై పెను ప్రభావమే పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ 3 సినిమాలపై సర్కారు సరకొత్త నిబంధనలు ఓ రేంజిలో ప్రబావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే రిలీజ్ సినిమాల టికెట్ల రేట్ల పెంపు, రోజుకు పరిమితికి మించి షోలను ప్రదర్శిస్తున్న తీరును నిరసిస్తూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేసిన కోర్టు… సరైన భద్రత లేకుండా అర్ధరాత్రుల్లో కొనసాగే సినిమా ప్రదర్శనల వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు… అర్థరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శితం అవుతున్న షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంక్రాంతికి వస్తున్నాం… సినిమాను అలా పక్కనపెడితే ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాను రోజుకు ఆరు షోల చొప్పున టికెట్లు విక్రయించినట్లుగా సమాచారం. మరి సర్కారు కొత్త మార్గదర్శకాలు ఈ సినిమాకు వర్తిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే సర్కారు కొత్త నిబంధనలు విడుదల అయ్యే సమయానికే ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక డాకు మహారాజ్ సినిమాను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేలా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుక్ మై షోలో టికెట్టు అమ్ముడైపోయాయి. ఇప్పుడు ఆ షో రద్దు కాగా… ఆ షో టికెట్లు కొన్న వారికి చిత్ర బృందం గానీ, ఆయా థియేటర్ల యాజమాన్యాలు గానీ ఎలా సర్ది చెబుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

This post was last modified on January 10, 2025 7:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

10 minutes ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

36 minutes ago

హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…

2 hours ago

ఏప్రిల్ నెలను వారణాసే కాపాడాలి

టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…

3 hours ago

రాకీ భాయ్ తిరిగి వస్తాడా?

కొన్ని క‌థ‌లు ముగిసిపోవ‌డాన్ని ప్రేక్ష‌కులు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. వాటికి కొన‌సాగింపు ఉంటేనే బాగుంటుంద‌ని ఆశిస్తారు. వాటి మేక‌ర్స్ కూడా ఆ…

3 hours ago

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…

3 hours ago