కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో యష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాలి. కానీ బోలెడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజరొకటి రిలీజ్ చేశారు.
చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు కానీ చిన్న విజువల్ తో పని కానిచ్చారు. స్టైలిష్ గా కారు దిగి పబ్బులోకి వెళ్లిన యష్ అక్కడో విదేశీ వనితను తీసుకుని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏం లేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్ తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లిమ్ప్స్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఒకరకంగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉంది. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కెజిఎఫ్ షేడ్స్ లో ఉన్నా మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద స్కేల్ ని ఎలా హ్యాండిల్ చేయబోతోందనేదేది ఆసక్తికరం. కెజిఎఫ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారా లేదానేది చెప్పలేం.
This post was last modified on January 8, 2025 11:41 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…