కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో యష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాలి. కానీ బోలెడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజరొకటి రిలీజ్ చేశారు.
చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు కానీ చిన్న విజువల్ తో పని కానిచ్చారు. స్టైలిష్ గా కారు దిగి పబ్బులోకి వెళ్లిన యష్ అక్కడో విదేశీ వనితను తీసుకుని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏం లేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్ తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లిమ్ప్స్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఒకరకంగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉంది. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కెజిఎఫ్ షేడ్స్ లో ఉన్నా మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద స్కేల్ ని ఎలా హ్యాండిల్ చేయబోతోందనేదేది ఆసక్తికరం. కెజిఎఫ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారా లేదానేది చెప్పలేం.
This post was last modified on January 8, 2025 11:41 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…