కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకోవడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో యష్ తీసుకున్న జాగ్రత్త వల్ల స్క్రిప్ట్ కోసమే ఎక్కువ సమయం ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఊహించని కాంబినేషన్ తో దర్శకురాలిగా గీతూ మోహన్ దాస్ ని ఎంచుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కావాలి. కానీ బోలెడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా వేశారు. తాజాగా యష్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజరొకటి రిలీజ్ చేశారు.
చెప్పుకోదగ్గ కంటెంట్ లేదు కానీ చిన్న విజువల్ తో పని కానిచ్చారు. స్టైలిష్ గా కారు దిగి పబ్బులోకి వెళ్లిన యష్ అక్కడో విదేశీ వనితను తీసుకుని ఆమె మీద మద్యం పోస్తూ చిన్న రొమాన్స్ చేయడం తప్ప అందులో ఏం లేదు. నిజానికి ఫ్యాన్స్ ఆశించింది వేరు. పెద్ద బిల్డప్, భారీ ఎలివేషన్ తో అంచనాలు పెంచేలా ఏదైనా గ్లిమ్ప్స్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు. ఒకరకంగా చెప్పాలంటే అధిక శాతం అభిమానులను నిరాశ కలిగించేలా ఉంది. గెటప్, గెడ్డం వగైరాలు కొంచెం కెజిఎఫ్ షేడ్స్ లో ఉన్నా మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో జరిగిన యాక్షన్ డ్రామానే క్లారిటీ అయితే వచ్చింది.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో ఇతర క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గోవా నేపథ్యంలో దశాబ్దాల వెనుక జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేసిన అనుభవం లేని అవార్డు విన్నింగ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇంత పెద్ద స్కేల్ ని ఎలా హ్యాండిల్ చేయబోతోందనేదేది ఆసక్తికరం. కెజిఎఫ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా చేస్తారా లేదానేది చెప్పలేం.
This post was last modified on January 8, 2025 11:41 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…