Movie News

అవి ట్రోల్స్ కాదు.. పొగడ్తలనుకుందట

నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద బాగా ట్రోలింగ్ నడిచింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య, ఊర్వశి రౌటెలాను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు.

ఐతే బయటి వాళ్లు ట్రోల్ చేయడం ఒకెత్తయితే.. స్వయంగా ఊర్వశి రౌటెలా ఈ పాట మీద వచ్చిన ట్రోల్స్ తాలూకు స్క్రీన్ షాట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె వరుసబెట్టి ఆ పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆమెను తిట్టిపోశారు. మిగతా వాళ్లు స్వయంగా ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆర్టిస్టే ట్రోల్స్ షేర్ చేస్తోందంటే సోషల్ మీడియా వేడి ఆమెకు గట్టిగానే తాకిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఐతే ఊర్వశి తర్వాత ఈ పోస్టులను డెలీట్ చేసింది. ఇదే విషయమై ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ఊర్వశి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అని ఆమె అనుకోలేదని.. తనను అందరూ పొగుడుతున్నారు అనుకుని షేర్ చేసిందని నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో తాను, దర్శకుడు బాబీ ఆమెకు అసలు విషయం చెప్పి ఆ పోస్టులన్నీ తీయించేసినట్లు తెలిపాడు. కానీ ఇది కవర్ డ్రైవ్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ పాట మీద ట్రోల్స్ వచ్చాయని ఊర్వశికి తెలుసని.. ఆమె కావాలనే ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేసిందని.. టీం ఆమెకేదో సర్దిచెప్పి వాటిని తీయించేసి ఉంటారని అనుకుంటున్నారు. మరీ ట్రోల్స్ ఏవో, పొగడ్తలేవో తెలియనంత అమాయకురాలు ఊర్వశి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on January 8, 2025 10:27 am

Share
Show comments

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

45 seconds ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

13 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago