నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద బాగా ట్రోలింగ్ నడిచింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య, ఊర్వశి రౌటెలాను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు.
ఐతే బయటి వాళ్లు ట్రోల్ చేయడం ఒకెత్తయితే.. స్వయంగా ఊర్వశి రౌటెలా ఈ పాట మీద వచ్చిన ట్రోల్స్ తాలూకు స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె వరుసబెట్టి ఆ పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆమెను తిట్టిపోశారు. మిగతా వాళ్లు స్వయంగా ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆర్టిస్టే ట్రోల్స్ షేర్ చేస్తోందంటే సోషల్ మీడియా వేడి ఆమెకు గట్టిగానే తాకిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఐతే ఊర్వశి తర్వాత ఈ పోస్టులను డెలీట్ చేసింది. ఇదే విషయమై ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ఊర్వశి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అని ఆమె అనుకోలేదని.. తనను అందరూ పొగుడుతున్నారు అనుకుని షేర్ చేసిందని నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో తాను, దర్శకుడు బాబీ ఆమెకు అసలు విషయం చెప్పి ఆ పోస్టులన్నీ తీయించేసినట్లు తెలిపాడు. కానీ ఇది కవర్ డ్రైవ్లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాట మీద ట్రోల్స్ వచ్చాయని ఊర్వశికి తెలుసని.. ఆమె కావాలనే ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేసిందని.. టీం ఆమెకేదో సర్దిచెప్పి వాటిని తీయించేసి ఉంటారని అనుకుంటున్నారు. మరీ ట్రోల్స్ ఏవో, పొగడ్తలేవో తెలియనంత అమాయకురాలు ఊర్వశి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…