నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద బాగా ట్రోలింగ్ నడిచింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య, ఊర్వశి రౌటెలాను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు.
ఐతే బయటి వాళ్లు ట్రోల్ చేయడం ఒకెత్తయితే.. స్వయంగా ఊర్వశి రౌటెలా ఈ పాట మీద వచ్చిన ట్రోల్స్ తాలూకు స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె వరుసబెట్టి ఆ పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆమెను తిట్టిపోశారు. మిగతా వాళ్లు స్వయంగా ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆర్టిస్టే ట్రోల్స్ షేర్ చేస్తోందంటే సోషల్ మీడియా వేడి ఆమెకు గట్టిగానే తాకిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఐతే ఊర్వశి తర్వాత ఈ పోస్టులను డెలీట్ చేసింది. ఇదే విషయమై ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ఊర్వశి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అని ఆమె అనుకోలేదని.. తనను అందరూ పొగుడుతున్నారు అనుకుని షేర్ చేసిందని నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో తాను, దర్శకుడు బాబీ ఆమెకు అసలు విషయం చెప్పి ఆ పోస్టులన్నీ తీయించేసినట్లు తెలిపాడు. కానీ ఇది కవర్ డ్రైవ్లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాట మీద ట్రోల్స్ వచ్చాయని ఊర్వశికి తెలుసని.. ఆమె కావాలనే ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేసిందని.. టీం ఆమెకేదో సర్దిచెప్పి వాటిని తీయించేసి ఉంటారని అనుకుంటున్నారు. మరీ ట్రోల్స్ ఏవో, పొగడ్తలేవో తెలియనంత అమాయకురాలు ఊర్వశి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on January 8, 2025 10:27 am
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…