నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘డాకు మహారాజ్’ నుంచి ఇటీవలే రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాట విషయమై సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ మీద బాగా ట్రోలింగ్ నడిచింది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. బాలయ్య, ఊర్వశి రౌటెలాను కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు.
ఐతే బయటి వాళ్లు ట్రోల్ చేయడం ఒకెత్తయితే.. స్వయంగా ఊర్వశి రౌటెలా ఈ పాట మీద వచ్చిన ట్రోల్స్ తాలూకు స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె వరుసబెట్టి ఆ పోస్టులు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆమెను తిట్టిపోశారు. మిగతా వాళ్లు స్వయంగా ఈ పాటలో డ్యాన్స్ చేసిన ఆర్టిస్టే ట్రోల్స్ షేర్ చేస్తోందంటే సోషల్ మీడియా వేడి ఆమెకు గట్టిగానే తాకిందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఐతే ఊర్వశి తర్వాత ఈ పోస్టులను డెలీట్ చేసింది. ఇదే విషయమై ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీని విలేకరులు ప్రశ్నిస్తే.. ఆయన చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ఊర్వశి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు ట్రోల్స్ అని ఆమె అనుకోలేదని.. తనను అందరూ పొగుడుతున్నారు అనుకుని షేర్ చేసిందని నాగవంశీ చెప్పడం విశేషం. దీంతో తాను, దర్శకుడు బాబీ ఆమెకు అసలు విషయం చెప్పి ఆ పోస్టులన్నీ తీయించేసినట్లు తెలిపాడు. కానీ ఇది కవర్ డ్రైవ్లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాట మీద ట్రోల్స్ వచ్చాయని ఊర్వశికి తెలుసని.. ఆమె కావాలనే ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేసిందని.. టీం ఆమెకేదో సర్దిచెప్పి వాటిని తీయించేసి ఉంటారని అనుకుంటున్నారు. మరీ ట్రోల్స్ ఏవో, పొగడ్తలేవో తెలియనంత అమాయకురాలు ఊర్వశి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
శివ, క్షణక్షణం, సత్య, రంగీలా లాంటి సినిమాలతో కల్ట్ మేకర్ అనిపించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫామ్ తగ్గిపోయిన…
తెలుగులో దసరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెర మీద ఎక్కువగా అదో…
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.…