Movie News

శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. టీఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఈ రోజు ఉదయం కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ తో పాటు రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి భాస్కర్ ను అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు.

రేవతి కుటుంబానికి, శ్రీ తేజ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ భరోసానిచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ సంఖ్యలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని కిమ్స్ చుట్టు పక్కల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆయన ఈ రోజు ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్..శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే ముందుగా సమాచారం ఇవ్వాలని, అప్పుడే తగినంత భద్రత కల్పిస్తామని పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.

Kumar

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

32 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

41 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago