సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. టీఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన ఈ రోజు ఉదయం కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ తో పాటు రేవతి భర్త భాస్కర్ ను పరామర్శించారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి భాస్కర్ ను అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు.
రేవతి కుటుంబానికి, శ్రీ తేజ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ భరోసానిచ్చారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడకుండానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ రాక సందర్భంగా ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ సంఖ్యలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని కిమ్స్ చుట్టు పక్కల భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆయన ఈ రోజు ఆస్పత్రికి వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్..శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే ముందుగా సమాచారం ఇవ్వాలని, అప్పుడే తగినంత భద్రత కల్పిస్తామని పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on January 7, 2025 10:48 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…