గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా ఆవకాశాలు తగ్గిపోయాయని, వాయిదా పడటం ఖాయమని కొన్నివారాలుగా వినిపిస్తున్నా నిర్మాణ సంస్థ నుంచి దాన్ని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాకపోవడం అభిమానుల్లో అనుమానాలు పెంచింది.
అయితే ఒక్కొకరుగా ఆ డేట్ ని తీసుకోవడం మొదలవ్వడంతో ప్రభాస్ రావడం లేదనే విషయం ఫ్యాన్స్ కి అర్థమైపోయింది. ముందు సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ కోసం లాక్ చేసుకున్నారు. ఆ తర్వాత ధనుష్ ‘ఇడ్లి కడాయ్’ అఫీషియల్ గా ప్రకటించింది. తాజాగా అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ కొద్దీ అదే తేదీని అధికారికంగా తీసుకుంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కం కామెడీ ఎంటర్ టైనర్ కు టాలీవుడ్ సంచలనం దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకూర్చాడు. నేపధ్య సంగీతం జివి ప్రకాష్ కుమార్ ఇస్తాడని ఆల్రెడీ టాక్ ఉంది.
తలా ఫ్యాన్స్ లో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. తొలుత సంక్రాంతికి రావాలనుకున్నారు. కానీ అజిత్ మరో చిత్రం విడాముయార్చి వల్ల వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పొంగల్ కి రెండూ రాకపోవడం వేరే సంగతి. సో చేతిలో ఉన్న మూడు నెలల్లో ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లి గుడ్ బ్యాడ్ అగ్లీ గ్రాండ్ రిలీజ్ ఇవ్వబోతున్నారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఈ లెక్కన విడాముయార్చి ఇప్పట్లో వచ్చే సూచనలు లేనట్టే. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఒక పాట పది రోజుల క్రితమే రిలీజయ్యింది. కానీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ లో వస్తుంది కాబట్టి దానికన్నా ముందు అజిత్ దే మరో సినిమా వచ్చే ఛాన్స్ ఎంతమాత్రం ఉండదు.
ఇప్పటికే పోస్ట్ పోన్లు, వరస డిజాస్టర్లతో కిందా మీద పడుతున్న లైకా సంస్థకు ఈ తాజా పరిణామం షాక్ ఇచ్చేదే. ఏదైతేనేం అటుఇటు తిరిగి ఆరేడు నెలల్లో అజిత్ రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. అదే జరిగితే కొత్త రికార్డని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ అధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది.
This post was last modified on January 6, 2025 5:32 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…