తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బెనిఫిట్ షోలకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది. రెండు చోట్లా అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతున్నాయి. ‘పుష్ప-2’ సినిమాకైతే ముందు రోజు 9.30 నుంచే షోలు మొదలైపోయాయి. కానీ అలాంటి ఓ షో సందర్భంగానే హైదరాబాద్ సంధ్య థియేటర్లో ఒక విషాదం జరిగింది. దీంతో తెలంగాణలో బెనిఫిట్ షోల విషయమై పీటముడి బిగుసుకుంది.
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు ఉండవని ప్రభుత్వం తేల్చేసింది. ఐతే కొన్ని రోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతుంది. వాటికి అదనపు షోలు, రేట్లు తెచ్చుకోవాలని నిర్మాతలు చూస్తుండగా.. ఆంధ్రలో ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు పర్మిషన్లు వచ్చేశాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కూడా కోరుకుంటే అనుమతులు రావడం లాంఛనమే.
కానీ తెలంగాణలో పరిస్థితి ఏంటన్నదే ఇంకా తేలడం లేదు. మూడు సంక్రాంతి చిత్రాల్లో రెండు నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినవే. మూడోది కూడా ఆయనే నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన అదనపు షోలు, రేట్ల కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. కానీ ఏ సంగతీ క్లారిటీ లేదు. ఒకవేళ అనుమతులు వచ్చినా అర్ధరాత్రి, ముందు రోజు రాత్రి షోలు అయితే ఉండవని తెలుస్తోంది.
తెల్లవారుజామున 4 గంటలు లేదా ఆ తర్వాతే షోలు పడేలా పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదనపు రేట్లు వస్తే చాలని చూస్తున్న దిల్ రాజు.. అర్ధరాత్రి షోలకు అనుమతులు లేకపోయినా ఇబ్బంది లేదని భావిస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం. ఆంధ్రలో మాత్రం గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు అర్ధరాత్రి 1 గంటలకు షోలు కన్ఫమ్ అయినట్లే.
గత ప్రభుత్వ కాలంలో అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలు లేక అక్కడి సినీ ప్రియులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణలో చాలా ముందుగానే షోలు పడి టాక్ బయటికి వచ్చేసేది. ఆ తర్వాతే ఆంధ్రా జనం సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆంధ్రలో ఫస్ట్ షో అయ్యేసరికి సీన్ రివర్స్ ఐపోయిందని చెప్పుకోవచ్చు. చూద్దాం తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో.
This post was last modified on January 5, 2025 7:07 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…