రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో సినిమాలకు సంబంధించిన కబుర్లతో పాటు రాజకీయ మెరుపులు కూడా తోడయ్యాయి. టికెట్ రేట్ల కోసం హీరోలు వచ్చి నమస్కారం పెట్టి ప్రాధేయపడటం గుర్తు చేస్తూ అలాంటి నియంతృత్వ పోకడ తమ ప్రభుత్వంలో ఉండదని, ఈ విషయంలో తమకు స్వర్గీయ ఎన్టీఆరే స్ఫూర్తని చెప్పడం ఆహుతులను ఆకట్టుకుంది.
నిర్మాతలు, కౌన్సిల్ బాడీలు, అసోసియేషన్లు వచ్చి అడిగితే అనుమతులు మంజూరు చేస్తామని, అంతే తప్ప హీరోలే రావాలనే కట్టుబాటు తమ దగ్గర ఉండదని స్పష్టం చేశారు.
మనల్ని మనం టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ అని విభజించుకోకూడదని, ఇదంతా ఇండియన్ సినిమా అంటూ వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్టూడియోలు నిర్మించడంతో పాటు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి ఇక్కడి యువతకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని వేదిక మీదే ఉన్న తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ దిల్ రాజుని ఉద్దేశించి అన్నారు.
కావాలంటే త్రివిక్రమ్, రాజమౌళి, తమన్ లాంటి వాళ్ళతో ఇక్కడ క్లాసులు చెప్పించి స్కిల్స్ పెంచే దిశగా ఏదైనా ప్రణాళిక వేయమని కోరడం ఆచరణ సాధ్యాసాధ్యాల గురించి ఆలోచింపజేసేలా ఉంది.
టికెట్ రేట్ల పెంపు గురించి మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ధరలు నిర్ణయించడం జరుగుతుందని, బ్లాక్ మార్కెట్ ని అరికట్టడం ద్వారా అధికంగా పెంచిన రేటు ద్వారా గవర్నమెంట్ కు ఆదాయం పెరుగుతుందని వివరించడం ఆకట్టుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇండస్ట్రీకి సహకారం అందించేందుకు ఎప్పడూ సిద్ధంగా ఉంటారని చెప్పి సినీ పరిశ్రమకు బహిరంగ ఆహ్వానం అందించారు. సవివరంగా, విశ్లేషణాత్మకంగా పవన్ కళ్యాణ్ చెప్పిన చాలా విషయాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. వీలైనంత త్వరగా కార్యాచరణ జరిగితే మాత్రం టాలీవుడ్ మరింత ఎత్తులు చూస్తుంది.
This post was last modified on January 4, 2025 11:05 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…