టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఆర్టిస్టులకు పవన్ గతంలో అనేక సార్లు ఆపన్న హస్తం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు పవన్ తాజాగా ఆర్థిక సాయం చేసిన వైనం వైరల్ గా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు అధిక షుగర్ తో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవన్ అండగా నిలిచారు.
నూతన సంవత్సరం సందర్భంగా పవన్ తనుకు చేసిన సాయాన్ని వెల్లడిస్తూ ఫిష్ వెంకట్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. కొంతకాలం క్రితం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, దీంతో, రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ చెప్పారు. అనారోగ్యంతో సినిమాలకు దూరం అయ్యానని, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు. తన భార్య సువర్ణ ఒత్తిడి చేయడంతో పవన్ను కలిశానని వెల్లడించారు.
పవన్ను కలిసిన తర్వాత ఆయన తనకు భరోసానిచ్చారని, అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఫిష్ వెంకట్ అన్నారు. తన బ్యాంకు ఖాతాలో వెంటనే రూ. 2 లక్షలు పవన్ జమ చేయించారని, తమ కుటుంబం పడుతున్న ఆర్థిక కష్టాలు విని పవన్ చలించిపోయారని వెంకట్ అన్నారు. తన కిడ్నీ చికిత్స కోసం కూడా పవన్ సాయం చేస్తారని హామీనిచ్చారని తెలిపారు.
ఈ కష్టకాలంలో తనను ఆదుకున్న పవన్ తనకు దేవుడని, ఆయన కుటుంబం ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తానని భావోద్వేగానికి గురయ్యారు. వీడియో చివర్లో పవన్ స్టైల్లో ఫిష్ వెంకట్ న్యూ ఈయర్ విషెస్ చెప్పిన ఆ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది
This post was last modified on January 2, 2025 2:28 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…