టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన ఆర్టిస్టులకు పవన్ గతంలో అనేక సార్లు ఆపన్న హస్తం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు పవన్ తాజాగా ఆర్థిక సాయం చేసిన వైనం వైరల్ గా మారింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు అధిక షుగర్ తో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కు పవన్ అండగా నిలిచారు.
నూతన సంవత్సరం సందర్భంగా పవన్ తనుకు చేసిన సాయాన్ని వెల్లడిస్తూ ఫిష్ వెంకట్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. కొంతకాలం క్రితం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, దీంతో, రోజు మార్చి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ చెప్పారు. అనారోగ్యంతో సినిమాలకు దూరం అయ్యానని, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు. తన భార్య సువర్ణ ఒత్తిడి చేయడంతో పవన్ను కలిశానని వెల్లడించారు.
పవన్ను కలిసిన తర్వాత ఆయన తనకు భరోసానిచ్చారని, అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఫిష్ వెంకట్ అన్నారు. తన బ్యాంకు ఖాతాలో వెంటనే రూ. 2 లక్షలు పవన్ జమ చేయించారని, తమ కుటుంబం పడుతున్న ఆర్థిక కష్టాలు విని పవన్ చలించిపోయారని వెంకట్ అన్నారు. తన కిడ్నీ చికిత్స కోసం కూడా పవన్ సాయం చేస్తారని హామీనిచ్చారని తెలిపారు.
ఈ కష్టకాలంలో తనను ఆదుకున్న పవన్ తనకు దేవుడని, ఆయన కుటుంబం ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తానని భావోద్వేగానికి గురయ్యారు. వీడియో చివర్లో పవన్ స్టైల్లో ఫిష్ వెంకట్ న్యూ ఈయర్ విషెస్ చెప్పిన ఆ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది
This post was last modified on January 2, 2025 2:28 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…