ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి ఒరిజినల్ మేకర్స్కు సమాచారమే తెలిసేది కాదు. కానీ ఈ సోషల్ మీడియా కాలంలో సమాచారం ప్రపంచం నలు మూలలకూ చేరుతోంది. మన సినిమాల ఎక్స్పోజర్ పెరిగి వాటి గురించి దేశ విదేశాల్లో తెలుస్తోంది. ఈ క్రమంలో తమ సినిమాలను కాపీ కొట్టారని తెలిసిన విదేశీ ఫిలి మేకర్స్ ఊరుకోవట్లేదు. లీగల్ చర్యలకు సిద్ధమైపోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ని తన చిత్రం ‘లార్గో వించ్’ను కాపీ కొట్టి తీశారంటూ దాని దర్శకుడు అప్పట్లో పెద్ద గొడవే చేశాడు. ఐతే లీగల్ యాక్షన్ వరకు వెళ్లకుండానే ఇష్యూ సెటిలైనట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ మాత్రం.. తమిళ సినిమా ‘విడాముయర్చి’ విషయంలో అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. అజిత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో మగిల్ తిరుమణి రూపొందిస్తున్న ‘విడాముయర్చి’ సినిమాకు.. పారామౌంట్ వారి ‘బ్రేక్ డౌన్’ స్ఫూర్తి అంటున్నారు.
ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. విషయం పారామౌంట్ వరకు వెళ్లి.. వాళ్లు లీగల్ చర్యలకు సిద్ధమయ్యారు. తమ సినిమా కథను, సన్నివేశాలను కాపీ కొట్టినందుకు రూ.85 కోట్లు కట్టాలని పారామౌంట్.. లైకా వాళ్లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడడానికి ఈ గొడవే కారణం.
ఐతే రిలీజ్కు ముందే రూ.85 కోట్లు చెల్లిస్తే తమకు భారీ నష్టం తప్పదని లైకా భావిస్తోంది. ఇందుకోసం ఒక రాజీ డీల్ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. సినిమాలో వాటా ఇస్తామని, భాగస్వామి కావాలని పారామౌంట్ వారికి ఆఫర్ ఇచ్చారట. కథను వాడుకున్నందుకు నిర్మాణంలో కొంత వాటా ఇచ్చి ఆ మేరకు బిజినెస్లో షేర్ ఇవ్వాలని లైకా అధినేతలు భావిస్తున్నారు. ఈ డీల్ ఓకే అయ్యాకే సినిమా రిలీజ్ సంగతి తేలనుంది.
This post was last modified on January 2, 2025 3:32 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…