క్రిస్మస్ రిలీజ్ వదులుకున్నందుకు రాబిన్ హుడ్ విషయంలో నితిన్ బాగా అసహనంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. హీరో డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో పాటు హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చేవి. కానీ పుష్ప 2 రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు అల్లు అర్జున్ అనుకోకుండా కేసులో ఇరుక్కుని బెయిలు దాకా వెళ్లడం వల్ల మైత్రి నిర్మాతలకు రాబిన్ హుడ్ మీద ఫోకస్ పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇబ్బంది కన్నా వాయిదా మేలనుకుని డ్రాపయ్యారు.
తీరా చూస్తే రాబిన్ హుడ్ వదులుకున్న డిసెంబర్ 20, 25 తేదీల్లో వచ్చిన కొత్త సినిమాలన్నీయావరేజ్ కంటే కిందే నిలిచిపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. పుష్ప 2 వీకెండ్స్ హౌస్ ఫుల్స్ చేయగా సుదీప్ మాక్స్ కు పాజిటివ్ టాక్ వచ్చినా అదేమీ పెద్ద వసూళ్లుగా మారలేదు. మార్కో ఆలస్యంగా జనవరి 1 వచ్చినా సరే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్స్, రివ్యూస్ చూసిన తెలుగు ఆడియన్స్ మొదటి రోజు బాగానే వెళ్లినట్టు స్పష్టమవుతోంది. అంటే బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన వాక్యూమ్ ని ఒక అతి హింసాత్మకంగా ఉన్న మలయాళం డబ్బింగ్ చిత్రం వాడుకుంది కానీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ లేకపోయింది.
ఇక్కడ నితిన్ గుస్సాని మరో స్థాయికి తీసుకెళ్లే ఇంకో అంశం ఉంది. శివరాత్రికి ప్లాన్ చేసుకున్న తమ్ముడుని రాబిన్ హుడ్ వల్ల వాయిదా వేయక తప్పదు. మరీ తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండటం అంత సేఫ్ గేమ్ కాబోదు. కనీసం మూడు నెలల నిడివి ఉండటం అవసరం. ఇప్పుడు రాబిన్ హుడ్ ఏం చేస్తాడనే దాని మీద తమ్ముడు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రిస్మస్ కి నితిన్ కనక వచ్చి ఉంటే జనవరి 10 దాకా కనీసం రెండు వారాలకు పైగా స్ట్రాంగ్ రన్ దక్కేది. అదంతా మిస్ అయిపోయింది. అయినా కొన్నిసార్లు పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.
This post was last modified on January 1, 2025 7:01 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…