క్రిస్మస్ రిలీజ్ వదులుకున్నందుకు రాబిన్ హుడ్ విషయంలో నితిన్ బాగా అసహనంతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. హీరో డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తో పాటు హీరోయిన్ శ్రీలీల లాంటి ఆకర్షణలు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చేవి. కానీ పుష్ప 2 రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటంతో పాటు అల్లు అర్జున్ అనుకోకుండా కేసులో ఇరుక్కుని బెయిలు దాకా వెళ్లడం వల్ల మైత్రి నిర్మాతలకు రాబిన్ హుడ్ మీద ఫోకస్ పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇబ్బంది కన్నా వాయిదా మేలనుకుని డ్రాపయ్యారు.
తీరా చూస్తే రాబిన్ హుడ్ వదులుకున్న డిసెంబర్ 20, 25 తేదీల్లో వచ్చిన కొత్త సినిమాలన్నీయావరేజ్ కంటే కిందే నిలిచిపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. పుష్ప 2 వీకెండ్స్ హౌస్ ఫుల్స్ చేయగా సుదీప్ మాక్స్ కు పాజిటివ్ టాక్ వచ్చినా అదేమీ పెద్ద వసూళ్లుగా మారలేదు. మార్కో ఆలస్యంగా జనవరి 1 వచ్చినా సరే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్స్, రివ్యూస్ చూసిన తెలుగు ఆడియన్స్ మొదటి రోజు బాగానే వెళ్లినట్టు స్పష్టమవుతోంది. అంటే బాక్సాఫీస్ దగ్గర ఏర్పడిన వాక్యూమ్ ని ఒక అతి హింసాత్మకంగా ఉన్న మలయాళం డబ్బింగ్ చిత్రం వాడుకుంది కానీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ లేకపోయింది.
ఇక్కడ నితిన్ గుస్సాని మరో స్థాయికి తీసుకెళ్లే ఇంకో అంశం ఉంది. శివరాత్రికి ప్లాన్ చేసుకున్న తమ్ముడుని రాబిన్ హుడ్ వల్ల వాయిదా వేయక తప్పదు. మరీ తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు ఉండటం అంత సేఫ్ గేమ్ కాబోదు. కనీసం మూడు నెలల నిడివి ఉండటం అవసరం. ఇప్పుడు రాబిన్ హుడ్ ఏం చేస్తాడనే దాని మీద తమ్ముడు నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రిస్మస్ కి నితిన్ కనక వచ్చి ఉంటే జనవరి 10 దాకా కనీసం రెండు వారాలకు పైగా స్ట్రాంగ్ రన్ దక్కేది. అదంతా మిస్ అయిపోయింది. అయినా కొన్నిసార్లు పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.
This post was last modified on January 1, 2025 7:01 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…