టాలీవుడ్లో చాలా ఓపెన్గా, కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడే నిర్మాతగా సూర్యదేవర నాగవంశీకి పేరుంది. ఆయన కామెంట్స్ పలు సందర్భాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కొన్నిసార్లు వివాదానికి కూడా దారి తీశాయి. ‘అవతార్-2’ సినిమాను విమర్శించడం మొదలుకుని.. పెద్ద హీరోల సినిమాలకు కథ అవసరం లేదంటూ చేసిన కామెంట్ వరకు పలుమార్లు ఆయన వార్తల్లో నిలిచాడు.
ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా బాలీవుడ్ను తక్కువ చేసేలా ఆయన చేసిన కామెంట్లు హిందీ సినీ పరిశ్రమ ప్రముఖులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తెలుగు సినీ పరిశ్రమ బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుంటే.. బాలీవుడ్ బాంద్రా-జుహు మధ్య స్ట్రక్ అయిపోయిందంటూ లెజెండరీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్తో మాట్లాడుతూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
పుష్ప-2 సినిమా ఒకే రోజు 86 కోట్లు కలెక్ట్ చేసిన రోజు బాలీవుడ్లో ఎవ్వరూ నిద్ర పోయి ఉండరంటూ నాగవంశీ చేసిన కామెంట్ కూడా దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై కొంచెం లేటుగా బాలీవుడ్ నుంచి ప్రతిఘటన మొదలైంది. బోనీ లాంటి లెజెండరీ, సీనియర్ ప్రొడ్యూసర్ను కించపరిచేలా నాగవంశీ మాట్లాడడాన్ని బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
తెలుగు సినిమాలు గత కొన్నేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్లు అవుతున్నంత మాత్రాన ఇంత అహంకారం పనికి రాదని.. ఘన చరిత్ర ఉన్న హిందీ సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం తప్పని అక్కడి వాళ్లు మండి పడుతున్నారు. దర్శకుడు సంజయ్ గుప్తా వరుస ట్వీట్లతో నాగవంశీ మీద ఎటాక్ చేయగా.. హన్సల్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ లాంటి పేరున్న డైరెక్టర్లు నాగవంశీ కామెంట్ల మీద సెటైర్లు వేశారు.
బాలీవుడ్ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు అయితే నాగవంశీ మీద తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నాయి. తన వ్యాఖ్యలతో పాటు బాడీ లాంగ్వేజ్ను తప్పుబడుతూ.. బాలీవుడ్ ఘన చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇలా మిడిసిపడితే కింద పడే రోజులు దగ్గర్లోనే ఉంటాయని కొందరు క్రిటిక్స్ హెచ్చరిస్తున్నారు. ఐతే తెలుగు వాళ్లు మాత్రం ఎన్నో ఏళ్ల పాటు మనల్ని తక్కువగా చూసిన బాలీవుడ్ వాళ్లకు నాగవంశీ గట్టి స్ట్రోకే ఇచ్చాడంటూ కొనియాడుతున్నారు.
This post was last modified on January 1, 2025 4:44 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…