గత రెండు సీజన్లలో ఒక కంటెస్టెంట్కి పబ్లిక్ ఫుల్ సపోర్ట్ గా నిలబడిపోవడంతో విజేత ఎవరనేది చాలా ముందుగానే తెలిసిపోయింది. ఈసారి అలా జరగకుండా బిగ్బాస్ యమ జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తోంది. అసలే ఐపీఎల్ తాకిడికి ఇబ్బంది పడుతోన్న బిగ్బాస్ షో ఇక విజేత ఎవరనేది ముందే తెలిసిపోతే కనుక పూర్తిగా చప్పబడిపోతుంది. అందుకే ఈ సీజన్ని తమకు నచ్చిన విధంగా నడిపిస్తోన్న భావన కలుగుతోంది.
ఫలానా కంటెస్టెంట్లు హౌస్లో వుండాలి, అదే సమయంలో వాళ్లు స్ట్రాంగ్ అయిపోకుండా చూసుకోవాలి. ఇదే అజెండాతో ఈ సీజన్ నడుస్తోంది. టిక్టాకర్ మెహబూబ్ పట్ల మొదట్నుంచీ ఆడియన్స్లో నెగెటివ్ ఫీలింగ్ వచ్చింది. నిజానికి అతను ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయి వుండాలి. విచిత్రంగా స్ట్రాంగ్ అనిపిస్తోన్న దేవి నాగవల్లిని ఎలిమినేట్ చేసేసి టాస్కులలో ‘బండ రాముడి’లా ఆడుతూ మసాలా అందిస్తోన్న మెహబూబ్ని కాపాడుకున్నారు.
ఈవారం కనుక మెహబూబ్ నామినేట్ అయితే ఖచ్చితంగా అవుట్ అయిపోయేవాడు. మెహబూబ్ని చాలా మంది నామినేట్ చేసారు కూడా. కానీ కెప్టెన్ సోహైల్కి ఒక పవర్ ఇచ్చి ఒకరిని కాపాడే శక్తినిచ్చారు. సోహైల్కి హౌస్లో క్లోజ్ ఫ్రెండ్ మెహబూబ్ కనుక అతడినే సోహైల్ కాపాడతాడని బిగ్బాస్కి కూడా తెలుసు. కావాలనే ఆ పవర్ సోహైల్కి ఇచ్చి మరో రెండు వారాల పాటు మెహబూబ్ లోపల వుండేలా చూసుకున్నారు.
అదే సమయంలో సోహైల్కి, అభిజీత్కి పెరుగుతోన్న ఫాలోయింగ్తో వాళ్లిద్దరూ డిఫెన్స్లో పడేలా వీకెండ్లో నాగార్జునతో డోస్ ఇప్పించారు. వారి గేమ్ స్టయిల్ మారితే మరెవరైనా స్ట్రాంగ్ అయి విజేత ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారుతుందనేది బిగ్బాస్ గేమ్ ప్లాన్ అయి వుండొచ్చు.
This post was last modified on October 13, 2020 12:20 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…