ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా స్పష్టత లేని శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి మెగా ఫ్యాన్స్ హడావిడి చేశారు కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశ్వంభర గురించి మాత్రం హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని చిరంజీవి సీరియస్ గా తీసుకుని మార్పుల గురించి దర్శక నిర్మాతలతో చర్చించారనే టాక్ నెలల క్రితమే వచ్చింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. అనిల్ రావిపూడితో చేయబోయే మూవీ సైతం సౌండ్ చేస్తోంది కానీ విశ్వంభర నుంచి ఏ హడావిడి లేదు. దీని వెనుక వ్యూహాత్మక మౌనం ఉందని మెగా కాంపౌండ్లో వినిపిస్తున్న మాట.
ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని గేమ్ ఛేంజర్ మీద నిలిచేలా చేయాలి. సుదీర్ఘ నిర్మాణం కావడంతో తగ్గిపోయిన బజ్ ని పెంచడం నిర్మాత దిల్ రాజు బృందానికి పెద్ద సవాల్ గా మారింది. అందుకే అమెరికా వెళ్లి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకొచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ని గెస్టుగా తీసుకొచ్చి మరో వేడుక చేయబోతున్నారు. ఆ తర్వాత జరిగే నెక్స్ట్ మెగా రిలీజ్ హరిహర వీరమల్లు. దీనికి సైతం గేమ్ ఛేంజర్ సమస్యే ఉంది. ఫ్యాన్స్ ఓజి జపం చేస్తున్నారు కానీ దీన్ని అంతగా పట్టించుకోవడం లేదు. హైప్ పెరగడానికి ఏమేం చేయాలో నిర్మాత ఏఎం రత్నం పక్కా ప్రణాళికతో ఉన్నారట. దీనికి చాలా కసరత్తు అవసరం.
వీటి కోసమే విశ్వంభర హంగామాని ఇంకా మొదలుపెట్టలేదని అంటున్నారు. దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం రీ వర్క్ మీద బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా స్పందన చూసి అభిమానుల అంచనాల మీద ఒక క్లారిటీ వచ్చింది. వాటిని అందుకోవడం అంత సులభం కాదని అర్థమైపోయింది. బింబిసారలో హీరో కళ్యాణ్ రామ్ కాబట్టి కొన్ని లోపాలు బలమైన కంటెంట్ వల్ల కవరైపోయాయి. కానీ విశ్వంభరకు ఆ ఛాన్స్ లేదు. ప్రతిదాన్ని భూతద్దంలో చూసే యాంటీ ఫ్యాన్స్ తో పాటు కొండంత ఆశలు పెట్టుకున్న అభిమానులను సంతృప్తి పరచాలి. ఏప్రిల్ లేదా మే విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
This post was last modified on December 31, 2024 9:05 am
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…