చాలా సినిమాల కథలు నిజ జీవిత అనుభవాల నుంచే పుడతాయి. చాలామంది దర్శకులు తమ సొంత కథలకు కమర్షియల్ హంగులు జోడించి చెబుతుంటారు. ‘హృదయ కాలేయం’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట’ లాంటి మరో సక్సెస్ ఫుల్ సినిమాను అందించిన సాయిరాజేష్.. ఇప్పుడు కథ సమకూర్చడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన ‘కలర్ ఫోటో’కు కూడా ఆయన వ్యక్తిగత అనుభవాలే స్ఫూర్తి అట. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తన కథే అంటున్నాడాయన.
సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా ‘కలర్ ఫోటో’ కథ ఎలా పుట్టిందో సాయిరాజేష్ వివరించాడు. చిన్నతనంలో తాను నల్లగా, అంద విహీనంగా ఉన్నానని చాలా బాధపడేవాడినని.. ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయేవాడినని సాయిరాజేష్ తెలిపాడు. యుక్త వయసులోకి వచ్చాక ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. రెండేళ్ల పాటు ఆమెను దూరం నుంచి చూస్తూ, ఫాలో అవుతూ గడిపానని.. ఐతే తన రంగు, రూపం బాగోవన్న ఉద్దేశంతో ఆమెకు తన ప్రేమ గురించి చెబితే ‘నో’ అంటుందన్న భయంతో మౌనంగా ఉండిపోయినట్లు తెలిపాడు.
ఐతే వయసు పెరిగాక యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం కావడం, ఆయన పుస్తకాలు చదవడం, స్నేహితులు పెరగడంతో తనలో భయాలన్నీ పోయాయని, భౌతిక అందం గురించి ఆలోచించడం మానేసి వ్యక్తిగా ఎదగడం మీద దృష్టిపెట్టానని.. అలా ఒక స్థాయిని అందుకున్నానని.. ఐతే దర్శకుడిగా మారాక తన కథను సినిమాగా తీయాలన్న కోరిక బలంగా కలిగిందని.. ఐతే తన ప్రేమకథను చెప్పడం కన్నా.. నల్లగా ఉండి, ఆత్మవిశ్వాసం లేని హీరో పాత్ర వరకు తన నుంచి తీసుకుని.. మిగతాదంతా కల్పన జోడించి ‘కలర్ ఫోటో’ కథ రాసి, దానికి సుహాస్ సరిపోతాడనిపించి అతణ్ని తీసుకున్నానని సాయిరాజేష్ తెలిపాడు.
తాను ఈ కథకు స్క్రీన్ ప్లే, మాటలు రాయలేకపోయానని ముందు బాధ పడ్డానని.. కానీ తాను పూర్తి స్క్రిప్టు రాసి, ఈ సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే రెండేళ్లకు పైగా సమయం పట్టేదని.. సందీప్ చేతికి ఇచ్చి మంచి పని చేశానని, అతను చక్కటి స్క్రీన్ ప్లే, డైలాగులతో ఈ సినిమాను అందంగా మలిచాడని సాయిరాజేష్ వెల్లడించాడు. టీజర్, ఇతర ప్రోమోలతో ఆకట్టుకున్న ‘కలర్ ఫోటో’ ఈ నెల 23న ‘ఆహా’లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…